By: ABP Desam | Updated at : 06 May 2023 03:57 PM (IST)
కొత్త సెక్రటేరియట్లోకి రాజాసింగ్కు నో ఎంట్రీ - అసలేం జరిగిందంటే ?
Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు తెలంగాణ నూతన సచివాలయంలోకి వెళ్లేందుకు అనుమతి లభించలేదు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్ిచంది. అయితే సచివాలయంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది. కానీ బుల్లెట్పై సెక్రటేరియట్కు వచ్చిన రాజాసింగ్ను.. భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొద్ది సేపు గేటు వద్ద ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో వెళ్లిపోయారు.
MLA ని సెక్రటేరియట్ లోపటికి అనుమతించలేదు
— Gayathri Bandari (@GayathriBDevi) May 6, 2023
ప్రజా ప్రతినిధి అది కూడా మంత్రి పిలిస్తే వెళ్లిన రాజాసింగ్ గారి పరిస్థితి ఇలా ఉంటె
ఇక ప్రజలకు అనుమతి ఉంటుందా?
ఎవరి కోసం కట్టారు?
మీ వాస్తు కోసమేనా?
అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోదు
ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టండి pic.twitter.com/wOyDjwQsgN
మీటింగ్ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పంపితేనే తాను ఇక్కడకు వచ్చానన్నారు. లోపలికి అనుమతి లేకుంటే ఆహ్వానం ఎందుకు పంపారని నిలదీశారు. టైమ్ పాస్ కోసం మీటింగ్ పెట్టారా ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ లోపలికి రాకూడదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను గేటు వద్దే ఆపేయటం బాధ కలిగించిందన్నారు. మంత్రి తలసాని పిలిచి అవమానించారని అన్నారు. మంత్రి పేషీ వాదన మాత్రం మరోలా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్కు కూడా ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. అయితే రాజాసింగ్ మాత్రం గేటు వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయారని మంత్రి పేషీ అధికారులు వెల్లడించారు. తాను వెళ్లిపోలేదని లోపలికి అనుమతించలేదని రాజాసింగ్ మండిపడ్డారు.
తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభానికి కూడా ఇతర పార్టీల వారెవరూ రాలేదు. గవర్నర్ కు కూడా ఆహ్వానం పలకకపోవడం వివాదాస్పదమయింది. మరో వైపు సీఎస్ ను కలిసి.. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా దారి మధ్యలోనే నిలిపివేశారు. ఇతర పార్టీల నేతలను సచివాలయంలోకి అనుమతించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!
Errabelli Dayakar Rao: త్వరలో బీసీ కుల వృత్తుల వారికి రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహకారం: మంత్రి ఎర్రబెల్లి
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CPI Narayana : సీఎం జగన్కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి