By: ABP Desam | Published : 25 Oct 2021 09:52 AM (IST)|Updated : 26 Oct 2021 12:36 PM (IST)
హుజురాబాద్లో నేతలు అక్కడే !
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా ఇప్పుడు ప్లీనరీ మూడ్లో ఉన్నారు. కానీ ఈ ప్లీనరీకి హరీష్ రావుకు ఆహ్వానం లేదు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదు హుజురాబాద్ ఎన్నికల పనులు చూసుకుంటున్న ఎవరికీ ఆహ్వానం లేదు. అందరూ ఎన్నికల పనుల్లోనే బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్తో పాటు హుజూరాబాద్లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పినట్లుాగ తెలుస్తోంది. అక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు.
Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొనాలని నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. కానీ వారికి ఎన్నికల బాధ్యతలు అడ్డు వస్తున్నాయి. గత ఐదు నెలలుగా నియోజకవర్గం ఆంతటా కలియ తిరుగుతున్న వారంతా పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈనెల 30నే పోలింగ్ జరగనున్నందున అందరు ఒక్క సారిగా ప్లీనరీకి తరలి వస్తే హుజురాబాద్లో ఒక రోజు పూర్తిగా టీఆర్ఎస్ యాక్టివిటీ ఆగిపోతుందని అది పార్టీకి నష్టం చేస్తుందని టీఆర్ఎస్ హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తోంది.
Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి
నిజానికి ప్లీనరీకి హాజరయ్యే వారిసంఖ్యను కూడా పరిమితం చేశారు. మొదట్లో పదిహేను వేల మంది వరకూ అంచనా వేశారు. కానీ తర్వాత కేసీఆర్ కేవలం ఆరు వేల మందితోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు . దీంతో స్థాయిలను బట్టి ఆహ్వానాలు పంపుతున్నారు. వారు మాత్రమే హాజరవుతారు. ఏ స్థాయిలో ఉన్నా హుజురాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు హాజరయ్యే అవకాశం లేదు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్కి ప్లస్సా ? మైనస్సా ?
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం హైదరాబాద్ వచ్చారు. ప్రతి నియోజవకర్గం నుంచి యాభై మందికి ఆహ్వానాలు పంపారు. ఆహ్వానాలు పంపిన వారిని మాత్రమే అనుమతిస్తారు. అయితే ప్లీనరీలో పాల్గొనకపోయినా అనేక మంది టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు హైదరాబాద్ మొత్తాన్ని గులాబీ మయం చేయడంతో సందడి నెలకొంది.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్కి ప్లస్సా ? మైనస్సా ?
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి
Revanth Reddy Rachabanda : రైతుల వద్దకు "డిక్లరేషన్" - "రచ్చబండ" ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!