అన్వేషించండి

Vemulawada: రాజన్న క్షేత్రంలో దొంగల హల్చల్, నేరాలు బాగా పెరుగుతున్నా పట్టించుకోని అధికారులు?

రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల కాంప్లెక్స్ వసతి గదుల్లోకి చొరబడి మరీ చోరీలు చేస్తున్నారు.. కొందరు దుండగులు.

Theft Cases in Vemulawada Rajanna Temple: దక్షిణ కాశీగా పేరొందిన సిరిసిల్లలోని వేములవాడ (Vemulawada) పుణ్యక్షేత్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల కాంప్లెక్స్ వసతి గదుల్లోకి చొరబడి మరీ చోరీలు చేస్తున్నారు. జాతర గ్రౌండ్ ప్రాంతంలోని నందీశ్వర కాంప్లెక్స్ వసతి గదుల్లో చోటుచేసుకున్న ఈ చోరీకి సంబంధించి అటు భక్తులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఎర్రవెల్లి గణేష్, వరంగల్ (Warangal) కు చెందిన తాడూరు విశ్వనాథం అనే యాత్రికులు రాజన్న దర్శనం కోసం శనివారం రాత్రి వేములవాడ (Vemulawada) నందీశ్వర కాంప్లెక్స్ లో వసతి గదులను అద్దెకు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో భద్రత ఉందని భావించిన వీరు స్వామి దర్శనం కోసం ఆదివారం ఉదయం గదులకు తాళం వేసి వెళ్లారు. 

గణేష్ కి మూడవ నంబరు సూట్ రూమ్ కేటాయించగా విశ్వనాథం 156వ నంబర్ గల గదిలో తమ సామాన్లను ఉంచి దర్శనం కోసం వెళ్లారు. అయితే తిరిగి వచ్చేసరికి ఈ రెండు గదుల తాళాలు పగలగొట్టి ఉండడం గమనించిన వీరు దీనికి సంబంధించి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. తమ సెల్ ఫోన్లు నగదు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేశారు. మరోవైపు పూర్తిస్థాయిలో భద్రత ఉందనుకున్న వీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలించాలని ఆలయ సిబ్బందిని కోరారు. అయితే వారి నుండి ఊహించని స్పందన ఎదురైంది. ఏ మాత్రం పట్టించుకోని ఆలయ సిబ్బంది వైఖరి పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారితో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో ఆలయ సిబ్బంది ఫోన్లను లాక్కోవడంతో పాటు వారిపై దాడికి కూడా దిగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆలయ పీఆర్ఓ, ఇద్దరు ఏఈవోలు అక్కడికి చేరుకొని వారిని శాంతింప చేశారు. 

మొత్తం ఎనిమిది సెల్ ఫోన్లు, 20 వేలకు పైగా నగదు చోరీకి గురైందని, దీనికి బాధ్యులు ఎవరని భక్తులు ఆలయ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ గొడవతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. కనీసం సీసీటీవీ ఫుటేజ్ లను సైతం పరిశీలించకుండా తాత్సారం చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో దూరం నుండి రాజన్న దర్శనానికి వస్తే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని వారు వాపోయారు.

దీంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టణ సీఐ వెంకటేష్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని భక్తులకు హామీ ఇవ్వడంతో పాటు వారి సొమ్ము వెనక్కి వచ్చేలా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే ఇంత కీలకమైన పుణ్యక్షేత్రానికి కనీస భద్రత సౌకర్యాలు లేకపోవడం పట్ల అంతట ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget