By: ABP Desam | Updated at : 24 Mar 2022 10:02 PM (IST)
సభలో మాట్లాడుతున్న హరీష్ రావు
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్కో న్యాయం తెలంగాణకో న్యాయం ఎందుకని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్రం ఎందుకింత మొండిగా ఉంటుందో అర్థం కావడం లేదన్నారు హరీష్. ఇక కేంద్రం, బీజేపీ తీరుకు నిరసనగా ఆందోళనలు ఉద్దృతం చేయాలని ఆదేశించారాయన.
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్న హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంటిపై నల్లజెండాలు ఎగరవేయాలని సూచించారు. అలాగైన బీజేపీ లీడర్లకు బుద్ది వస్తుందన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్ష అన్ని ప్రాంతాల్లో చర్చజరాగాలన్నారు. ప్రతి గ్రామంలో తీర్మానం చేసి పీఎంకి పంపించాలని సూచించారు.
సిద్దిపేటలో మాట్లాడిన హరీష్ గతంలో అన్ని ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు చేశాయని ఇప్పుడే కేంద్రం ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెట్టి రైతుల గొంతు కోస్తుందన్నారు హరీష్. తెలంగాణ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదమన్న ఆయన... పంజాబ్లో అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేయమని తెలిపారు. వన్ నేషన్ వన్ రేషన్ అన్న నినాదం ఎత్తుకున్న కేంద్రం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం ఎందుకు తీసుకురాదని ప్రశ్నించారు.
Addressing the #TRSParty cadre meeting at Siddipet. https://t.co/6PvKg0o75z
— Harish Rao Thanneeru (@trsharish) March 24, 2022
Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్లు - ట్విస్ట్ ఏంటంటే !
Karimnagar: రాష్ట్రం ఆ పని చేస్తే పెట్రోల్ రూ.80కే ఇవ్వొచ్చు - బండి సంజయ్ వ్యాఖ్యలు
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!