అన్వేషించండి

కరీంనగర్ ప్రజావాణి - విన్నపాలు సరే, పరిష్కారం ఏదీ?

కరీంనగర్ జిల్లా ప్రజావాణికి విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ వాటి పరిష్కారాలు మాత్రం దొరకట్లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు.  

"ప్రజావాణి"... జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే ఆశయం గొప్పగా ఉన్నా, ఆచరణలో మాత్రం లక్ష్యాలను అందుకోలేకపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయానికి కచ్చితంగా ప్రజావాణిని నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు అన్ని సమస్యలు వింటున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో మెజారిటీగా భూములకు సంబంధించి అంశాలు ఉండటం గమనార్హం. కుటుంబ సభ్యుల మధ్య లేదా వారి దగ్గర బంధువుల మధ్యే ఈ భూ సమస్యలు ఉండటం వల్లే సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది. 

సమస్యలు వింటున్నా పరిష్కారాలు మాత్రం చూపట్లేరు..

కరోనా తర్వాత కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత అధికారులను ప్రత్యక్షంగా కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం రావడంతో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి చేరుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే అధిరులు ఫిర్యాదులు అన్నీ బాగానే వింటున్నారు. కానీ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత సమస్యలను మాత్రం తీర్చడం లేదు. ఏళ్ల తరబడి దరఖాస్తులకు పరిష్కారం దొరకడం లేదు. పరిష్కారం చేయకుండా అధికారులు నోటీసులు ఇచ్చి పరిష్కరించామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. 

కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా..

జగిత్యాల జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల ప్రగతిపై ప్రతి గురువారం కలెక్టర్ సమీక్షిస్తున్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని, సరైన శ్రద్ధ వహించాలని ఆదేశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో దరఖాస్తులు  తీసుకుని రిసిప్ట్ తో సరిపెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల దరఖాస్తులకు మోక్షం లేదు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి రావడంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా మండల కేంద్రంలోని ప్రజావాణి నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. పరిస్థితి సాధారణ స్థితిలోకి వచ్చినప్పటికీ మండల కేంద్రాల్లో అమలు చేయడం లేదు. దీంతో ప్రజలు దూరమైనా కూడా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. మండలాల్లో ప్రజావాణి ఉంటే ప్రయాస తగ్గుతుందని ప్రజలు అంటున్నారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మండల అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత అప్పటి పాలనాధికారి అలగు వర్షిణి ప్రజావాణి కోసం ప్రత్యేక సాఫ్టువేర్ రూపొందించారు. ఒక  రూమ్ లో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు బాధితుల దరఖాస్తును స్కానింగ్ చేసి, ఒక సంఖ్యని కేటాయించి ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసేవారు. 

నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు..

సంబంధిత బాధితుడు ప్రజావాణి వేదిక వద్దకు వెళ్లగా కలెక్టర్ సంఖ్య ఆధారంగా సమస్యను చూసి అక్కడికక్కడే సంబంధిత అధికారికి పంపించే వారు. జిల్లా స్థాయిలో పారదర్శకత పెరిగింది ఈ విధానం ఆగిపోయింది. ప్రతి దరఖాస్తు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు ఉంటే పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల నుంచి మండల స్థాయిలోకి అధికారికి దరఖాస్తు చేరిన వెంటనే కొన్ని చోట్ల మీ అప్లికేషన్ పరిశీలనలో ఉంది అంటూ, నోటీసులతో సరిపెడుతున్నారు. అలా కాకుండా పరిష్కారం ఏ స్థాయిలో ఉందని సమాచారం ఇస్తే బాధితుల్లో కొంత ఊరట కలుగుతుంది. ప్రతి దరఖాస్తు పురోగతి ఆన్ లైన్ లో ఉంటే పరిశీలన చేసేందుకు వీలుగా ఉంటుంది. అంతిమంగా బాధితుడికి న్యాయం చేకూరిస్తేనే కదా ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు అర్థం, పరమార్ధం ఉండేది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget