అన్వేషించండి

Leopard in Peddapalli: పెద్దంపేట శివారులో చిరుతపులి సంచారం, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల సూచన!

Leopard in Peddapalli: పెద్దపలిల్లి జిల్లా పెద్దంపేట గ్రామ శివారులో చిరుత కలకలం రేపుతోంది. పుశువుల మధ్యలోంచి చిరుత వెళ్లడం గమనించిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Leopard in Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధి అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని ఎస్టీ కాలనీ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈరోజు ఉదయం పశువుల కాపర్లు తమ పశువుల మధ్యలో నుంచి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. అప్రమత్తమైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Leopard in Peddapalli: పెద్దంపేట శివారులో చిరుతపులి సంచారం, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల సూచన!

రామగుండం ఫారెస్ట్ అధికారి రహమతుల్లా తన సిబ్బందితో ఎస్టీ కాలనీలో పరిశీలించారు. చిరుత పులి అడుగులను గుర్తించి, నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిరుతపులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని సూచించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో పశువులను మేపకుండా ఉండాలని పేర్కొన్నారు.


Leopard in Peddapalli: పెద్దంపేట శివారులో చిరుతపులి సంచారం, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల సూచన!

ఇటీవలే రాజన్న సరిసిల్ల జిల్లాలో..

చిరుత సంచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. పదిరోజుల వ్యవధిలోనే మరో చిరుత వరుస దాడులు చేసింది. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో చిరుత సంచారం రైతులతో పాటు గ్రామస్తులలో కూడా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం వేణుగోపాల్పూర్‌లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత నిన్న రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి పొలిమేరల్లో ఉన్న గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. 

రైతు తన గేదెను పొలం దగ్గర కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వెళ్ళి చూడగా అది మృత్యువాత పడి ఉంది. అక్కడి పరిసరాల్లోని కాలి అడుగుల గుర్తులను బట్టి చిరుత పులి దాడి చేసినట్లుగా స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ రైతులు తమ పశువులను మొదటి నుండి పొలాలు వద్దే కట్టేసుకుంటారని, గతంలో ఎన్నడూలేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరించి, వరుస దాడులు చేస్తూ గేదెలను మరియు దూడలను చంపడంతో రైతులు మరియు గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నామన్నారు.

గుంపులు గుంపులుగా వెళ్లండి.. అటవీ శాఖ అధికారులు...

ఫారెస్ట్ అధికారులు సైతం సమీప గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.. తునికాకు ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవి లోపలికి ప్రజలు వెళ్లకూడదని.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా మాత్రమే కలిసి వెళ్లాలని సూచించారు. అయితే ఇప్పటి వరకూ  మనుషులపై దాడి చేయని చిరుతపులి ప్రధానంగా ఆకలి తీర్చుకోవడానికి మూగజీవాల పైన అర్ధరాత్రి వేళల్లో తరచూ దాడులు చేస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే ఇది ఒకటేనా  లేదా ఈమధ్య ఏమైనా వాటి సంఖ్య పెరిగిందా ? అనే విషయంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు

నిజానికి గుట్టలను ప్రధాన ఆవాసంగా చేసుకుని తిరుగుతున్న చిరుతపులి ఒకసారి సమీప గ్రామాల పై దాడి చేయడం మొదలుపెట్టింది అంటే ఇక తేలికగా దొరికే ఆహారం కోసం అది అలవాటు పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్దగా ప్రతిఘటించలేని ఆవులు గేదెలు, మేకలు లాంటి జంతువులను టార్గెట్ చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికైనా అధికారులు స్పందించి మనుషులపై దాడి చేసే పరిస్థితి రాకముందే వెంటనే చిరుతపులిని పట్టుకోవాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వేసవి కాలం ముగిసే రోజుల్లో ఉపాధి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణ  కోసం వెళ్ళే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విన్నవించుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Addanki Dayakar: కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా..?  అందుకే ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించ‌లేదా?  అద్దంకి దయాకర్ ఫైర్
కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా? అందుకే వారితో రాజీనామా చేయించ‌లేదా?
KTR BRS Politics: రేవంత్‌కు దమ్ముంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్
రేవంత్‌కు దమ్ముంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్
PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
India vs Pakistan probable playing 11: భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండవచ్చు.. పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఇలా
భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండవచ్చు.. పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఇలా
Advertisement

వీడియోలు

Diella World's First AI Minister | అవినీతిని నిర్మూలన కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ ను నమ్ముకున్న ఆల్బేనియా | ABP Desam
ENG vs SA | ఇండియా రికార్డ్ బద్దలు కొట్టిన ఇంగ్లండ్ | ABP Desam
IND vs PAK | బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్స్‌లు కొడతాడంటే డకౌట్ అయిన అయుబ్ | ABP Desam
Boycott Asia cup 2025 Ind vs Pak Match | సోషల్ మీడియాలో మళ్లీ బాయ్‌కాట్ ట్రెండ్ | ABP Desam
Asia Cup 2025 | ఒమన్ పై పాకిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar: కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా..?  అందుకే ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించ‌లేదా?  అద్దంకి దయాకర్ ఫైర్
కేటీఆర్‌కు ఆరోజు మ‌గ‌త‌నం, ద‌మ్ములేదా? అందుకే వారితో రాజీనామా చేయించ‌లేదా?
KTR BRS Politics: రేవంత్‌కు దమ్ముంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్
రేవంత్‌కు దమ్ముంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్
PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
India vs Pakistan probable playing 11: భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండవచ్చు.. పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఇలా
భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండవచ్చు.. పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఇలా
Paga Paga Paga Movie OTT: మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా
TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త
Embed widget