అన్వేషించండి

Karimnagar RTC: డిపోల వద్ద డ్రైవర్ల ఆందోళన, కరీంనగర్ లో నిలిచిన ఆర్టీసీ సర్వీసులు -ప్రయాణం సాగేదెలా !

డ్రైవర్లు కరీంనగర్ బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. దీంతో కరీంనగర్ వన్ డిపో, రెండో డిపో కు సంబంధించిన 96 బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

బస్సుల యజమాన్యంతో కలిసి ఆర్టీసీ అధికారులు తమను అకారణంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్లు కరీంనగర్ బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. దీంతో కరీంనగర్ వన్ డిపో, రెండో డిపో కు సంబంధించిన 96 బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బస్సులు లేకపోవడంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను అకారణంగా విధుల నుండి తొలగిస్తున్నారని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు ఆరోపించారు. కార్యాలయం చుట్టూ తిరిగినా తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల సంఘం స్పష్టం చేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటి సంస్థ నేడు లాభాల బాటలో పయనిస్తోంది. సరైన ప్లానింగ్, ప్రయాణికుల డిమాండ్ మేరకు సౌకర్యాల కల్పన వల్ల కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ రీజియన్లో 11 డిపోల్లో 862 బస్సులు ఉన్నాయి. 524 ఆర్టీసీ బస్సులు, 338 అద్దె బస్సులు ఉన్నాయి. 3,696 మంది  ఉద్యోగులు ఆర్టీసీ సేవలను అందిస్తున్నారు. 

అధికారులు ట్రాన్స్‌ఫర్
కరీంనగర్ రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్ర సర్వీసులను కూడా నడుపుతోంది ఆర్టీసీ సంస్థ. టీఎస్ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎమ్ మరియు డీఎంలు, ఇతర విభాగాల అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు. డీవీఎం పోస్టులను డిప్యూటీ ఆర్ఎం గా మార్చారు. సంస్కరణల్లో భాగంగా రౌండప్ ఛార్జీలు, డీజిల్ సేవ, టోల్ ట్యాక్స్ లాంటి పలు రకాలైన ఛార్జీల్లో  మార్పులు చేశారు. సిబ్బందికి కూడా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఐ-టిమ్ములను ప్రారంభించారు. 

జులైలో నష్టాలు.. ఆగస్టులో లాభాల బాట 
కరీంనగర్ రీజియన్లో ఆరు డిపోలు లాభాల బాట పట్టాయి. ఆగస్ట్ నెలలో వచ్చిన ఆదాయం మేరకు కరీంనగర్-1 డిపో, వేములవాడ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, గోదావరిఖని, మెట్ పల్లి, డిపోలో లాభాలు పొందగా, మిగిలిన జిల్లాలు నష్టాన్ని తగ్గించుకున్నాయి. ఇందులో 13.59 లక్షల కిలోమీటర్ల వరకు బస్సు సర్వీసులు 81.88 లక్షల  లాభాలు పొంది కరీంనగర్-1 డిపో మొదటిస్థానంలో నిలిచింది. 15.5 లక్షల కిలోమీటర్లు బస్సు సర్వీసులు నడిపి 2 .16 లక్షల ఆదాయం తో గోదావరిఖని డిపో ఆరవ స్థానంలో నిలిచింది. జూలైలో 32.2 లక్షల నష్టాల్లో ఉన్న కరీంనగర్ -1 డిపో అధిగమించి 82 లక్షల లాభాన్ని పొందడం విశేషం. జూలైలో వర్షాలు పడటం చాలా ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనుకున్న విధంగా ఆదాయం రాలేకపోయింది.

డిపోల వారీగా ఆదాయం చూస్తే కరీంనగర్-1 డిపో జులై నెలలో 2.89 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్టు నెలలో 82 లక్షల లాభాన్ని పొందింది. వేములవాడ 55. 27 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్టు నెలలో 55 లక్షల లాభం ఆర్జించింది. జగిత్యాల జిల్లా 32.03 లక్షల నష్టంతో ఉండగా,ఆగస్టు లో 54 లక్షల లాభం పొందింది. రాజన్న సిరిసిల్ల 33.41 లక్షల నష్టంతో ఉండగా, 30 లక్షల లాభం పొందింది. మెట్ పెల్లి 24.50 లక్షల నష్టంతో ఉండగా, ఆగస్ట్ లో 0.5 లక్షల లాభం పొందింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman BR Naidu: మహిళతో ఉన్న వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
మహిళతో ఉన్న వీడియోపై బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget