అన్వేషించండి

అన్నారం బ్యారేజీ వద్ద  ఇసుకమేట- ఆగమైతున్న అధికారులు! 

కరీంనగర్ జిల్లా మహదేవ పూర్ లో నిర్మించిన అన్నారం బ్యారీజీ వద్ద భారీ వరదల కారణంగా ఇసుకమేట సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియక నీటి పారుదల శాఖ అధికారులు తెగ టెన్షన్ పడుతున్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నారం బ్యారేజీ వద్ద ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. మొన్న కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో నీటితోపాటు ఇసుక కూడా కొట్టుకు వచ్చింది. ఇసుక పెద్ద ఎత్తున బ్యారేజీ గేట్ల వద్ద జమ కావడంతో నీటి పారుదల శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. బ్యారేజీ గేట్లకు ఇరువైపులా భారీగా ఇసుక మేట వేయడంతో కొన్ని గేట్లు మూసి వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి వరదలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉండడంతో ఇసుక మేట సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు తర్జనభర్జనా పడుతున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం గోదావరికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అప్పుడు కూడా ఇసుక వల్ల గేట్లకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. అయితే ఆ సమయంలో కాంట్రాక్టర్‌గా ఉన్న సంస్థ 80 కోట్ల ఇన్సూరెన్స్ కోరగా ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు పరిశీలించి తమ నివేదిక అందించారు. 

20 కోట్ల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చని నివేదికలో వెల్లడించారు. దీన్నిబట్టే సమస్య ప్రతీ యేడు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి (CDO) సంబంధించిన ఇంజినీర్లు కూడా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో పరిశీలించి ఇసుక మేట సమస్య ఏ స్థాయిలో ఉందో అప్పుడే ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఒకవైపు నదికి ఎనిమిది మీటర్ల వరకు తేడా వస్తుండడంతో సహజంగానే పెద్ద ఎత్తున అవుతుందని వారు అభిప్రాయ పడ్డారట. ఇక ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ సమస్య మరింత జటిలం అయింది. ఇందులో దాదాపు 66 గేట్లకు గాను 25 గేట్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంది.

ఇసుక తరలింపు సాధ్యమా?? 

నిజానికి ఇంత భారీ ఎత్తున జమ అయిన ఇసుక వల్ల కొన్ని గేట్లు మూసి ఉంచి మరి కొన్నిటిని నీటి పారుదల శాఖ అధికారులు తెరిపించారు. వీటితోపాటుగా దిగువ ప్రాంతానికి ఇసుక వెళ్లి పోయినట్లయితే తిరిగి అన్ని గేట్లు మూసేసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ ఇసుకను తొలగించి తరలించే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా అసలు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీయాల్సి ఉంటుందో ఒక రిపోర్టు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే దీని ప్రకారం రానున్న రోజుల్లో కూడా ఇదే సమస్య రిపీట్ అయితే ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరించగలరనే అంశంపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంపు హౌస్ ని వచ్చే నెల వరకు పని చేసే విధంగా చేయాలంటే బ్యారేజీలో కూడా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఇసుక సమస్యను పరిష్కరించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget