అన్వేషించండి

Karimnagar News : కీడు సోకిందని ఊరు ఖాళీ, మూఢ నమ్మకంతో గ్రామస్తుల వింత నిర్ణయం!

Karimnagar News : కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని కీడు సోకిందని ఖాళీ చేశారు. గ్రామంలో వరుసగా మరణాలు సంభవించడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Karimnagar News : కరీంనగర్ జిల్లాలో కీడు సోకిందని  గ్రామస్తులంతా ఊరు ఖాళీ చేసిన ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి గ్రామస్తులు గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు.  ఆ ఊరిలో వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి ఆరుగురు మృతి చెందడంతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు ఈ వింత నిర్ణయం తీసుకున్నారు. ఊరికి కీడు సోకడంతో వరుసగా చనిపోతున్నారనేది గ్రామస్తుల మాట.

నెల వ్యవధిలో ముగ్గురు మృతి 

తమ గ్రామానికి కీడు సోకిందనే మూఢ నమ్మకంతో ఊరు ఊరంతా ఖాళీ చేసి గ్రామ శివార్లకు వెళ్లారు. గురువారం ఉదయం గ్రామస్తులంతా తమ నివాసాలు విడిచి శివారులోని పంట పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకున్నారు. ఈ గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పండితుల సూచనతో గ్రామాన్ని విడిచి శివార్లలో మకాం వేశామని పలువురు చెబుతున్నారు. అంతా బయటకు రావడంతో ఆ గ్రామం నిర్మానుషంగా మారింది.  

చీమల భయంలో ఊళ్లు ఖాళీ 

 దెయ్యాలు ఉన్నాయని, ఆత్మలు తిరుగుతున్నాయని భయంతో ఊర్లు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. చేతబడులు చేశారన్న సందేహంతో ఊళ్లకు ఊళ్లే వసల వెళ్లిన ఘటనలు కూడా చూశాం. కానీ చీమలకు భయపడి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారంటే ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే మీరు పొరపడినట్లే. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న చీమలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  

అసలేం జరిగింది? 

 తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప‌ గ్రామాల్లోని ప్రజలను చీమలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గత కొంత‌ కాలంగా చీమలు అటవీ ప్రాంతాన్ని వదిలి గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా ఏది దొరికితే దానిని ఆరగించేస్తున్నాయి. రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేయడంతో పాటుగా, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లలపై దాడి చేసి వాటి చంపేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో ఎల్లో క్రేజీ చీమలు గ్రామాల్లో వస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిముషాల్లో మనుషులపై పాకుతూ ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేస్తున్నాయి. ఇలా ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేయడం ద్వారా మనిషి శరీరంపై దురదలు, చర్మం పొట్టులా రాలడం జరుగుతున్నాయి. పశువుల కంట్లో ఈ చీమలు పడితే పూర్తిగా చూపు కనిపించకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు చీమల దండుకు భయపడి ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. చీమల నివారణకు అనేక మందులు ఉపయోగించినా ఏమాత్రం వాటిపై ఫలితం చూపలేకపోతుండడంతో స్థానికులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  

ఎల్లో క్రేజీ చీమలు 

గత కొంత కాలంగా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప ప్రాంత ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అటవీశాఖ అధికారులు, కీటక శాస్త్రవేత్తలు రంగంలోకి దిగ్గారు. అటవీ ప్రాంతంలోని చీమల నమూనాలను సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు, వీటి నైజంను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని తొలి 100 ప్రమాదకరజాతుల్లో వీటిని చేర్చారని పర్యావరణవేత్త వైల్డ్ లైఫ్ పరిశోధకులు అంటున్నారు. ఎల్లో క్రేజీ యాంట్ దాడులు గతంలో కేరళ అడవుల్లోని పలు గ్రామాల్లో కనిపించాయని వీటిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు పరిశోధన జరిపారని అధికారులు అంటున్నారు.  తాజాగా ఎల్లో క్రేజీ చీమ జాతుల విస్తరణ బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  

Also Read : Rajanna Sircilla: అత్యాధునిక టెక్నాలజీతో రెడీ అవుతున్న రాజన్న సిరిసిల్ల నూతన పోలీస్ కార్యాలయం

Also Read : Telangana BJP: హైదరాబాద్‌లో పోస్టర్లు కలకలం, రాత్రికి రాత్రే గోడలపై ప్రత్యక్షం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget