అన్వేషించండి

TS News : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో వర్గపోరు, స్టేజిపైనే కొట్టుకున్న టీఆర్ఎస్ నేతలు

TS News : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో వర్గపోరు రచ్చకెక్కింది. స్టేజి మీదే టీఆర్ఎస్ నేతలు కొట్టుకున్నారు.

TS News : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో టీఆర్ఎస్ వర్గ పోరు రచ్చకెక్కింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల  కార్పొరేషన్ చైర్మన్  సాయి చందు, స్థానిక ఎమ్మెల్యే తనయుడు అజయ్ ఇద్దరి మధ్య స్టేజిపై వాగ్వాదం జరిగింది. వజ్రోత్సవాలు ముగిసిన అనంతరం స్టేజిపై సాయి చందు అభిమానులు తనకు బొకేలు ఇచ్చి  ఫొటోలు దిగుతున్న సందర్భంలో అజయ్ తన అనుచరులతో స్టేజిపై వచ్చి భౌతిక దాడికి దిగారు. అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ సాయి చందుపై దాడికి పాల్పడ్డారు. సాయి చందు చేతికి గాయం కావడంతో ఆయనను అక్కడ నుంచి తరలించారు పోలీసులు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన గుండాలను, రౌడీలను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ సభలో యువకుడి హల్ చల్ 

తెలంగాణ మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటిస్తున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు భాగంగా భారీ బందోబస్తు నడుమ సభ జరుగుతుండగా ఓ యువకుడు ఒక్కసారిగా స్టేజి మీదకు వచ్చి కలకలం సృష్టించాడు.  స్టేజిపై కేటీఆర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్, బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తోబాటు కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో నాయకులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలసులు అతన్ని పట్టుకొని వేదిక కిందికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడు ఇలా ఎందుకు చేశారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన యువకుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

TS News : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో వర్గపోరు, స్టేజిపైనే కొట్టుకున్న టీఆర్ఎస్ నేతలు

విద్యార్థులకు పాచిపోయిన ఆహారం 

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా  సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో పాల్గొన్న విద్యార్థులకు దుర్వాసన వస్తున్న భోజనం అందించారు. వాసన వస్తుండడంతో ఆహారాన్ని కొద్దిగా తిని వదిలేశారు విద్యార్థులు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యత వజ్రోత్సవాలకు ప్రభుత్వం లక్షల్లో డబ్బులు కేటాయించగా స్థానిక నేతల కక్కుర్తి పడి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. దీంతో తేరుకున్న నేతలు, అధికారులు ఆహార పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా డస్ట్ బిన్ లో పడేశారు.  ఎవరి కంటపడకుండా విద్యా్ర్థులను కూడా పంపించేశారు.  ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఎమ్మార్వో సమాధానం ఇవ్వలేదు. 

TS News : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో వర్గపోరు, స్టేజిపైనే కొట్టుకున్న టీఆర్ఎస్ నేతలు

Also Read : Delhi Liquor Scam: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు, నేడు ఏం తేలనుంది !

Also Read: Telangana Liberation Day 2022: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? భారత్‌లో హైదరాబాద్ విలీనం ఎలా జరిగిందో తెలుసా !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget