JEE Main Result 2023: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల విడుదల, టాపర్గా హైదరాబాదీ విద్యార్థి
JEE Main Result 2023: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన కౌండిన్య ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

JEE Main Result 2023:
మెయిన్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 స్కోర్తో మెయిన్ టాపర్గా నిలిచాడు. అడ్వాన్స్డ్లోనూ మంచి మార్కులు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేరాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంకు దక్కించుకున్నాడు. అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంకు సాధించాడు. మెయిన్స్లో అర్హత సాధించిన వారు తదుపరి పరీక్షకు ఏప్రిల్ 30 నుంచి మే 7లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుండగా ఫలితాను అదే నెల 18న విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ రెండవ సెషన్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన బెస్ట్ స్కోర్ (రెండు సార్లు రాస్తే..) ఆధారంగా ఎన్టీఏ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. ఈ మారు మొత్తం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















