అన్వేషించండి

Today News Weather Report: తెలంగాణలో దంచికొడుతున్న వానలు..మరో మూడురోజులు ఇదే పరిస్థితి

Telangana Weather Report: తెలంగాణవ్యాపంగా మూడురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాగులు,వంకలు పొంగి జనజీవనం స్తంభించింది. మరోమూడురోజులు వానలు కురవనున్నాయి

Weather In Telangana: తెలంగాణలో మూడురోజులుగా  వర్షం దంచికొడుతోంది. మూడురోజులుగా ముసురు వీడటం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

వదలని వాన
తెలంగాణలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.
ముఖ్యంగా రాత్రిళ్లు వాన దంచికొడుతుండటంతో తెల్లారిచూసేసరికి వాగులు, వంకలు పొంగి రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలు జిల్లాల్ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అటు హైదరాబాద్‌లోనూ ముసురు వీడకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ  జోరుగా వానలు కురుస్తుండటంతో  వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులు దాటిపోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు పదిలక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.

రాకపోకలకు అంతరాయం
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు,వంకలు పొంగుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.దుమ్ముగూడెం మండలంలో సీతవాగు, గుబ్బలమంగివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.చత్తీస్‌ఘడ్‌, ఒడిశా కు రాకపోకలు నిలచిపోయాయి.రహదారులపై పొంగుతున్న వాగుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ప్రయాణం చేయకుండా అడ్డుకుంటున్నారు. పలు గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు సైతం నిలిపివేశారు.ములుగు జిల్లాలో 20 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. టేకుపల్లి వద్ద జాతీయ రహదారి మీదుగా గోదావరి ప్రవహిస్తోంది.ఏటూరునాగారం మండలంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సుల్తాన్‌పూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. నగరాల్లోనూ లోతట్టు కాలనీలు నీటమునిగాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వర్షం వీడకపోవడంతో పత్తి చేలు నీటిలో నానిపోతున్నాయి. కరీనంగర్ జిల్లాలో ఇళ్లు కూలిపోయాయి.

మరో మూడురోజులు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం దృష్ట్యా మరో మూడురోజులు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో అధికారులు పసుపురంగు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరిలోనూ  వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే పంటపొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంట దెబ్బతింటోంది. మరో మూడురోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

అధికారులు అప్రమత్తం

మరో మూడురోజులు వర్షాలు కురవనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రెస్క్యూ బృందాలు సైతం సిద్ధమయ్యాయి.అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ, వాగులు పొంగే ప్రాంతాల వైపు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు ప్రవహిస్తుండగా ఎట్టిపరిస్థితుల్లోనూ దాటవద్దని హెచ్చరిస్తున్నారు. మరో మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులుపడే అవకాశం ఉండటంతో పొలాలకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Also Read: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు

Also Read: భారీ వర్షాలతో అప్రమత్తం, గోదావరి ఉధృతిపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు  ?
రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Embed widget