అన్వేషించండి

Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి

PDS Rice Missing Case | పేర్ని నాని ఫ్యామిలీకి సంబంధించిన గోదాముల్లో బియ్యం మాయం అయిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిగా మాజీ మంత్రి పేర్ని నాని పేరును చేర్చారు.

Perni Nani Name included in Ration Rice Missing Case | మచిలీపట్నం: గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. బియ్యం మాయం కావడంపై నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఇదివరకే కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పేర్ని నాని ఏపీ హైకోర్టులోలంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్‌ మోషన్ పిటిషన్ వేశారు.

నిందితులకు 12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
పేర్ని ఫ్యామిలీకి చెందిన గోదాములలో పౌరసరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయం కావడంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. A2 మానస తేజ, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి 12 రోజులపాటు రిమాండ్ విధించగా మచిలీపట్నం జైలుకు తరలించారు నోలీసులు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధ హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని లేనిపక్షంలో చర్యలు ఉంటాయని కోర్టు ఆదేశాలలో పేర్కొంది.

రేషన్ బియ్యం అవకతవకలపై కూటమి సర్కార్ ఫోకస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దృష్టిసారించిన విషయాలలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, విదేశాలకు ఏపీ నుంచి తరలించడం. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం పలుచోట్ల తనిఖీలు చేసి అక్రమాలను బయటపెట్టారు. గత ఐదేళ్ల మాదిరిగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సైతం రైస్ మిల్లర్లు, గోదాం యజమానులను హెచ్చరించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో స్టెల్లా అనే విదేశీ నౌకలో టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆపేశారు. ఇటీవల ఆ బియ్యాన్ని అన్ లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు.

యాప్ తెచ్చిన వెంటనే పేర్ని ఫ్యామిలీ లేఖ, అధికారుల చర్యలు

 

గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం సమాచారం తెలిసేందుకు పౌరసరఫరాల శాఖ యాప్ లాంచ్ చేసింది. అందులో వివరాలు ఎలా నమోదు చేయాలో గోదాం యజమానులు, సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. ఆ మరుసటి రోజే తమ గోదాముల్లో బియ్యం కొంత తగ్గిందని, అందుకు లెక్కగట్టి చెబితే డబ్బులు చెల్లిస్తామని పేర్ని జయసుధకు చెందిన గోదాము నుంచి లేఖ వచ్చింది. మొదట గోదాములో 3000 బస్తాలు కనిపించడం లేదనుకున్నారు, చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించారని, అధిక ధరలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారి ఫిర్యాదుతో పేర్ని జయసుధపై కేసు నమోదు చేశారు పోలీసులు.

విచారణకు హాజరు కావాలని పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు సైతం నోటీసులు జారీ చేశారు. ఎవరూ విచారణకు మాత్రం హాజరుకాలేదు. మిస్సింగ్ బియ్యానికి జరిమానాతో కలిపి రూ. కోటి 74 లక్షలకుపైగా చెల్లించారు. కానీ తప్పు చేసి డబ్బులు చెల్లించడం సరిదకాదని పోలీసులు చర్య తీసుకుంటున్నారు.  ఈ క్రమంలో పేర్ని నాని అదృశ్యమయ్యారని ప్రచారం జరగగా.. మీడియా ముందుకు వచ్చిన మాజీ మంత్రి తాను ఎక్కడికి పోలేదన్నారు. ఆడవారిపై కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని, రాజకీయంగా కక్ష ఉంటే తనను ఏమైనా చేసుకోవాలన్నారు.

Also Read: Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget