అన్వేషించండి

Hyderabad Crime News: హైదరాబాద్‌లో విగ్రహాల తరలింపులో విషాదాలు, కరెంట్ షాక్‌తో రెండు రోజుల్లో 9 మంది మృతి

Ganesh Idols Mishap | హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి విద్యుత్ తీగలు రథానికి తాకి 6 మంది చనిపోగా, సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో మరో ముగ్గురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.

Electrocution while shifting Ganesh Idol in Bandlaguda | హైదరాబాద్‌ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాలీపై విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపే ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో అంబర్‌పేట్ ప్రాంతంలో కూడా విషాద ఘటన నమోదైంది. రామ్ చరణ్ అనే యువకుడు గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ విద్యుత్ తీగలను తొలగించబోతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్‌లో విగ్రహాల తరలింపులో వరుస విషాదాలు..

కేవలం రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ నగరంలో మూడు విద్యుత్ ప్రమాదాలు జరిగి 9 మంది చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యుదాఘాతానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం ఇంకా మరువకముందే, ఇవే రకం మరిన్ని ఘటనలు చోటు చేసుకోవడం భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని అధికారులు తీవ్రంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్‌ల సమీపంలో విగ్రహాలు లేదా భారీ వస్తువులు తరలించే ముందు విద్యుత్ శాఖ సహాయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

రామంతాపూర్‌ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ సహాయం ఎల్లప్పుడూ కుటుంబాలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా ఇచ్చారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదన్న విద్యుత్ శాఖ

హైదరాబాద్‌ సమీపంలోని మైలార్ దేవ్ పల్లి- బండ్లగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై విద్యుత్ శాఖ స్పందించింది. దాదాపు 23 అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని ట్రాలీపై తరలించేటప్పుడు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యుత్ శాఖ వల్లే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను TGSPDCL విద్యుత్ శాఖ ఖండించింది. ఈ అంశంపై స్పందించిన సూపరింటెండింగ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ (రాజేంద్రనగర్ సర్కిల్) శ్రీ రామ్ మోహన్ తాను ఘటన ప్రదేశాన్ని పరిశీలించానని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు జరిగాయని ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

అంతేగాక, ట్రాలీలో ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తు కింద పడటమే గాయాలకు కారణమై ఉంటుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. పైన ఉన్న 33 కె.వి. విద్యుత్ లైన్ తెగడం, వేలాడడం, లేదా విద్యుత్ సరఫరా లో లోపం ఏర్పడినట్లు ఎక్కడా నమోదుకాలేదని విద్యుత్ శాఖ తెలిపింది. ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన కాదని, నిర్దిష్టంగా సమాధానం ఇచ్చింది.

ఈ ప్రమాద ఘటనపై ప్రజల్లో సందేహాలు తొలగించేందుకు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వయంగా పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో రథాలు, విగ్రహాలు, భారీ వస్తువుల తరలింపు సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా విద్యుత్ శాఖతో సంప్రదించాలి అని విద్యుత్ శాఖ సూచిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget