అన్వేషించండి

Telangana MLA Disqualification Petitions: అనర్హత పిటిషన్లపై నెల రోజుల్లో తేల్చండి - తెలంగాణ స్పీకర్‌కు హైకోరు ఆదేశం

Telangana Assembly Speaker: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు పిటిషన్లు పరిశీలించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికల్లా స్టేటస్ తెలియజేయాలని సూచించింది.

Telangana News: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచారని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకొని స్టేటస్ రిపోర్టు తెలియజేయాలని స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తామే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది.  

ముగ్గురిపైనే పిటిషన్

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారని వాళ్లపై అనర్హత వేటు వేయాలని ఈ మేరకు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది. పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందతోపాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌లో దాఖలు చేసిన ఈ పటిషన్లపై ఆగస్టు ఏడో తేదీనే వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం తీర్పును రిజ్వర్ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. నెల రోజుల తర్వాత ఇవాళ(సోమవారం సెప్టెంబర్‌ 9న) తీర్పు వెల్లడించింది.

స్పీకర్ పట్టించుకోలేదని వాదన

ఒక పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం సరికాదని వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్‌ నుంచి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈవిషయంలో కాలయాపన జరుగుతుంటే కచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించార. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కోర్టు ముందు ఉంచారు. తాము మార్చిలోనే స్పీకర్‌కు ఈ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని వాదనల్లో తెలిపారు. దాదాపు ఐదు నెలలకుపైగా అయిపోయిందని వెల్లడించారు.

ఉదహరణగా మణిపూర్ కేసు

మణిపూర్‌ ఎమ్మెల్యేల కేసును కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. 142 ఆర్టికల్‌ కింద సుప్రీంకోర్టు స్పీకర్‌కు నోటీసులు జారీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ మారడమే కాకుండా మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని దానం నాగేందర్‌ ఇష్యూను కోర్టుకు వివరించారు పిటిషనర్లు.

స్పీకర్‌ను ఆదేశించలేరన్న ప్రభుత్వం

స్పీకర్‌ను ఆదేశిస్తే రెండు వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. దానం, కడియం తరఫున శ్రీరఘురాం, మయూర్‌రెడ్డ్డి, జంధ్యాల రవిశంకర్‌ కోర్టులో వాదించారు. 

నాలుగు వారాల గడువు 

పిటిషనర్ల తరఫున వాదను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోకి తీసుకుంది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఎప్పుడు నోటీసులు ఇస్తారు... ఎప్పుడు విచారణకు పిలుస్తారు. ఎప్పటి నుంచి వాదనలు వింటారు... ఎప్పటి లోపు ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తారో వివరంగా షెడ్యూల్‌ తెలియజేయాలని ఆదేశించింది హైకర్టు.  నాలుగు వారాల్లో షెడ్యూల్ రిలీజ్ చేయకపోయినా నిర్ణయం ప్రకటించకున్నా తామే ఓ నిర్ణయం చెబుతామని పేర్కొంది హైకోర్టు. 

Also Read: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు - ఏమన్నారంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget