అన్వేషించండి

Telangana: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు - ఏమన్నారంటే!

Telangana News: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన వారికి న్యాయం చేస్తామని... ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామన్నారు.

Journalists House sites in Telangana: అర్హత ఉన్న జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy). రవీంద్రభారతి (Ravindra Bharati)లో జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ (JNJHS)లో సభ్యులకు భూమి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లబ్దిదారులైన జర్నలిస్టులకు ఇళ్ల పత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను సొసైటీ సభ్యులకు అందించారు. అంతేకాదు... ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిజం గురించి, జర్నలిస్టుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారాయన. 

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. వారి సంక్షేమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని... ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో  నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషాలు లేవని చెప్పారు. జర్నలిస్టుల సమస్యకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అంతేకాదు... వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని. అది ఎవరికి  వారే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో... ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందర్నారు రేవంత్‌రెడ్డి. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని... జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని అన్నారు. 

ఆనాడు సిద్ధాంతా వ్యాప్తి కోసం పత్రికలు.. నేడు దారుణం

ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పత్రికలు ఏర్పాటు చేసుకుంటే... నేడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని అన్నారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులు అందరికీ చెడ్డపేరు  వస్తోందన్నారు రేవంత్‌రెడ్డి. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారన్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టు సంఘాలపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే  బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. 

కొన్ని మీడియాల తీరు తప్పుపట్టిన రేవంత్ రెడ్డి

కొన్ని పత్రికలు, ఛానళ్ల తీరును తప్పుబట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. కొన్ని పత్రికలు భాష విషయంలోనూ గీత దాటుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి హోదాను కూడా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ పార్టీల  యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను... నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సూచించారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.  ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఇందు కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత  తాము తీసుకుంటామన్నారు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవన్నారు. జర్నలిస్టు సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదే అన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి 10 కోట్లు కేటాయిస్తున్నట్టు  ప్రకటించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ఆ విషయంలో... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదర్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అర్హులైన వారందరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామన్నారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో  అందరం భాగస్వాములం అవుదామన్నారు. ఇక... చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
Embed widget