తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ. 2000 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తంతో జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ అయ్యాయి.
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ఆదేశాలతో 2000కోట్ల జీపీఎఫ్, కమ్యూటేషన్ బకాయిలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 2000 కోట్లు విడుదల చేసింది.
- జీపీఎఫ్ బకాయిలు 100%, మే 2025 వరకు కమ్యుటేషన్ సెటిల్డ్.
- మొత్తం రూ. 6000 కోట్ల బకాయిల్లో మొదటి విడతగా ఈ మొత్తం విడుదల.
- హైకోర్టు ఆదేశాలు, ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం చర్యలు.
Telangana Employee Dues: తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లోకి నిధులు చేరనున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పదవి విరమణ బకాయిల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం(మే29) రెండువేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేసిన రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులకు అందాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాలు నిలిచిపోయాయి. తాజా ఉత్తర్వులతో జీపీఎఫ్ బకాయిలు 100శాతం క్లియర్ అయ్యాయి. అంతేకాకుండా, మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తిగా సెటిల్ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మే 2న ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో జరిపిన చర్చల ఫలితమే ఈ నిధుల విడుదల. ఆ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం ఆరు వేల కోట్ల బకాయిలను వంద రోజుల్లోగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి విడతగా ఈ భారీ మొత్తాన్ని విడుదల చేశారు.
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన వంద రోజుల డెడ్లైన్ను గౌరవించడం ద్వారా తన విశ్వసనీయతను చాటుకోవాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలో సరైన ఆర్థిక వ్యూహంతో ఈ నిధులను సర్దుబాటు చేశారు.
ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసిన వెంటనే, ప్రాసెస్ ప్రారంభమైంది. రాబోయే కొద్ది రోజుల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఈ సొమ్ము నేరుగా జమ కానుంది. మిగిలిన రూ. 4000 కోట్లను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బకాయిలను అంశం ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో ఉండటం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
- మొత్తం బకాయిలు- రూ. 6000 కోట్లు
- ప్రస్తుతం విడుదల చేసినవి- రూ. 2000 కోట్లు
- చెల్లింపు స్థితి- జీపీఎఫ్ బకాయిలు 100శాతం పూర్తి, మే 2025 వరకు కమ్యుటేషన్ సెటిల్డ్
- మిగిలిన మొత్తం - 4000 కోట్ల రూపాయలు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రిటైర్డ్ ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
తెలంగాణలో ఉద్యోగుల పదవీ విరమణ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
ఎంతకాలం పెండింగ్లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలను ప్రభుత్వం సెటిల్ చేసింది?
ప్రభుత్వం మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలను పూర్తిగా సెటిల్ చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు అందనున్నాయి.
ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎంత సమయం పట్టగలదు?
ప్రభుత్వం మొత్తం ఆరు వేల కోట్ల బకాయిలను వంద రోజుల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మొదటి విడతగా రూ. 2000 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ. 4000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని స్పష్టం చేసింది.
ఈ బకాయిల చెల్లింపునకు దారితీసిన పరిస్థితులు ఏమిటి?
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ట్రెండింగ్ వార్తలు






















