అన్వేషించండి

Telangana News: మళ్లీ ఎస్పీఎఫ్‌కు సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలు, అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్

తెలంగాణ సచివాలయం భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగం పర్యవేక్షిస్తోంది. దీన్ని తిరిగి ఎస్పీఎఫ్‌ అధీనంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Secretariat Security : తెలంగాణ సచివాలయం (Telangana Secretariat ) భద్రత విషయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం సెక్రటేరియట్ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (TSSP) విభాగం పర్యవేక్షిస్తోంది. దీన్ని  తిరిగి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ( SPF) అధీనంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం భద్రతపై ప్రభుత్వం అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త సచివాలయ భవనం ప్రారంభమైన తర్వాత నుంచి టీఎస్‌ఎస్‌పీ భద్రతను పర్యవేక్షిస్తోంది. సచివాలయ ఉద్యోగులతోపాటు సందర్శకులను లోపలికి అనుమతించే యాక్సెస్‌ కంట్రోల్‌ వంటి కీలక బాధ్యతల్ని టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది నిర్వర్తిస్తోంది. సచివాలయం నలువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టుల్లో పహారా కాస్తున్నారు. హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్‌ పోలీసులూ, సాయుధ రిజర్వ్‌ పోలీసులు...సెక్రటేరియట్ భద్రతలో పాల్గొంటున్నారు. అన్ని షిఫ్టుల్లో కలిపి వీరంతా 650 మంది ఉన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సెక్రటేరియట్ బాధ్యతలు ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే ఉండేవి. కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో... కార్యాలయాలు బీఆర్‌కే భవన్‌కు తరలించారు. అక్కడ కూడా ఎస్పీఎఫ్ సిబ్బందే భద్రత నిర్వహించింది. నూతన సచివాలయం పూర్తయిన తర్వాత సెక్రటేరియట్‌ భద్రత వ్యవహారాలను... అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగానికి అప్పగించింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. తాజాగా మళ్లీ ఎస్పీఎఫ్‌కు సెక్రటేరియట్ బాధ్యతల్ని అప్పగించేందుకు ప్రబుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితమే ఎస్పీఎఫ్‌ ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

డిజిటల్ పాస్​లతో ప్రవేశించే సందర్శకులు సచివాలయంలో ఎంతసేపు ఉన్నారు ? ఎవరెవరిని కలిశారు అనే సమాచారం డిజిటల్​గా రికార్డు అవ్వనుంది. వచ్చిన వ్యక్తే మరోసారి వస్తే పాత రికార్డు ఆధారంగా వీళ్లు ఇంతకు ముందు వచ్చారనే సమాచారం తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ఒక వ్యక్తి ఎన్నిసార్లు సచివాలయాన్ని సందర్శించారు అనే సమాచారం నిక్షిప్తమవ్వనుంది. సెక్రటేరియట్​లో అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగుల కోసం ప్రత్యేక పాస్​లు ఇచ్చారు. వీరి పాస్​లను డైరెక్టర్‌, హెచ్‌వోడీ, సెక్షన్‌ ఆఫీసర్‌ వివిధ ఉద్యోగాల వారీగా విభజించారు. ఉద్యోగ స్థాయిని బట్టి ఒక్కో స్థాయికి ఒక్కో రంగుతో కూడిన పాస్​లను జారీ చేశారు. సెక్రటేరియట్ భద్రత బాధ్యతను నిర్వహించే పోలీస్​శాఖ పర్యవేక్షణలో ఈ డిజిటల్ పాస్​లను పంపిణీ చేశారు. సెక్రటేరియట్​కు వచ్చే సందర్శకుల కదలికలను పోలీసులు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ సచివాలయంలో మొత్తం 300 వరకు సీసీ కెమెరాలున్నాయి. ఇదంతా కమాండ్ కంట్రోల్ రూమ్​కే అనుసంధానించి ఉంటుంది. ఇలా సెక్రటేరియట్​లోని ప్రతి అంగుళం నిఘా నీడలోనే ఉంటుంది.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  భద్రతలో ఇంటెలిజెన్స్‌ విభాగం కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వాహనాల కాన్వాయ్‌ను మార్చిన ఇంటెలిజెన్స్....తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ వద్ద పనిచేసిన భద్రత సిబ్బందిని తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత మార్పులు జరిగాయి. రేవంత్‌రెడ్డికి సంబంధించిన సమాచారం బహిర్గతమవడంతోనే సిబ్బందిని మార్చారనే జరుగుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget