అన్వేషించండి

Telangana CM Revanth Reddy :పంతాలకు పోవద్దు, సమ్మె ఆలోచన వద్దు - ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Telangana CM Revanth Reddy : పంతాలకు పోవద్దు, సమ్మె ఆలోచన వద్దు అని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు.

Telangana CM Revanth Reddy: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాజకీయ పార్టీల వలలో పడి సంస్థకు నష్టం చేసే పనులు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఏడాది తిరిగే సరికి సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కీలకమైన సమయంలో సమ్మె ఆలోచన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ఆదాయాన్ని కార్మికుల చేతుల్లోనే పెట్టేస్తామని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చర్చిద్దామని సూచించారు. 

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. మేడే సందర్భంగా ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడమని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంస్థ అని దీన్నికాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు.  

రాష్ట్రంలో పదళ్లు ఆర్థిక దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆర్టీసీలో గత పదేళ్లు భారీ విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దని హితవుపలికారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. వచ్చే ఆదాయమంతా కార్మికుల చేతిలో  పెడతామని ఎలా ఖర్చు చేద్దామో సూచనలు చేయాలని సూచించారు. అణాపైసా కూడా ఇంటికి తీసుకెళ్లేది లేదని కార్మికుల కోసమే ఖర్చు చేస్తామన్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఒకసారి ఆలోచించాలని సూచించారు. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని మరో ఏడాదిలో కుదురుకుంటుందని వివరించారు.  

పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దని ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దన్నారు. నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటా అని ఆర్టీసీ కార్మికులు భరోసా ఇచ్చారు.    

కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని అభివర్ణించారు. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నామని వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే కార్మికుల సహకారం మరువలేనిదిగా చెప్పారు.  

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానిదనని గుర్తు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.  

కార్మికులకు మేలు చేయడమే ప్రభుత్వ విధానమని అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నామన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందని ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. 

గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారని తెలిపారు రేవంత్. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారని వివరించారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు ఉందని చెప్పారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలిందన్నారు. 

ఇంత చేసిన కేసీఆర్‌ ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలిపారు. అసెంబ్లీకి పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండని డిమాండ్ చేశారు. కపటనాటక సూత్రధారి మళ్లీ బయల్దేరాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget