అన్వేషించండి

Dr Koneti Nageshwara Rao: రెయిన్ బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ వైద్యుడి ఆవిష్కరణకు అరుదైన గౌరవం

Dr Koneti Nageshwara Rao: పుట్టుకతోనే చిన్న పిల్లల గుండెల్లో ఏర్పడే రంధ్రాలను మూసేందుకు డాక్టర్ కోనేటి నాగేశ్వరావు తయారు చేసిన పరికరానికి  భారత ప్రభుత్వం తాజాగా పేటెంట్ మంజూరు చేసింది.

Dr Koneti Nageshwara Rao: పుట్టుకతోనే చిన్న పిల్లల గుండెలో ఏర్పడే రంధ్రాలను మూసి వేసేందుకు డాక్టర్ కోనేటి నాగేశ్వర రావు తయారు చేసిన వైద్య పరికరానికి భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్రపంచంలో ప్రతిరోజూ వెయ్యి మందిలో 10 మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో పుడుతున్నారు. అయితే ఆ లోపాల్లో 25 శాతం, వెంట్రిక్యులర్ సెఫ్టల్ డిఫెక్ట్ కు సంబంధించిన లోపాలే ఉంటున్నాయి. ఈ వ్యాధిలో గుండె యొక్క రెండు గదుల మధ్య ఉన్న రంధ్రం తెరిచి ఉంటుంది. వెంట్రిక్యులర్ సెఫ్టల్ డిఫెక్ట్ తో జన్మించిన పిల్లలు గుండె వైఫల్య లక్షణాలతో ఉండడం మాత్రమే కాకుండా ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో సమస్య మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా వారిలో కనిపిస్తుంటాయి. అయితే ఈ రంధ్రాలను మూసివేసే పరికరాన్ని రూపొందించడానికి తెలుగు వైద్యుడు, ప్రముఖ చిన్న పిల్లల హృద్రోగ చికిత్స నిపుణులు, రెయిన్ బో హార్ట్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కోనేటి నాగేశ్వర రావు తన బృందంతో కలిసి పరిశోధనలు చేశారు. 2009లో ఆయన శ్రమ ఫలించింది. ఆయన రూపకల్పన చేసిన పరికరానికి కోనార్-ఎంఎఫ్ డివైజ్ గా నామకరణం చేశారు. దీనికి విదేశాల నుంచి కూడా అనుమతులు దక్కాయి. 


Dr Koneti Nageshwara Rao: రెయిన్ బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ వైద్యుడి ఆవిష్కరణకు అరుదైన గౌరవం

ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే.. ట్రాన్స్ క్యాథన్ ద్వారా దీన్ని గుండె గదుల మధ్య ఉంచి రంధ్రాలను మూసివేస్తారు. మన దేశంతో పాటు జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా తదితర 72 దేశాల్లో ఇప్పటికే 1000 మంది చిన్నారులకు విజయవంతంగా దీన్ని ఉపయోగించారు. ఈ పరికరంపై 2012లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించగా... ఉత్తమ ఆవిష్కరణ కింద ఎంపిక అయింది. తాజాగా భారత ప్రభుత్వం ఈ పరికరానికి సంబంధించి తనకు పేటెంట్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చిందని డాక్టర్ నాగేశ్వర రావు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Embed widget