అన్వేషించండి

Sadar Utsav: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..

సదర్‌ ఉత్సవాలకు వచ్చేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన కారులో వచ్చారు. ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు రాగానే ఆయన కారు ఓ వ్యక్తి పాదం మీదుగా వెళ్లింది.

తెలంగాణలో ఓ మంత్రి కుమారుడిపై కేసు నమోదైంది. సినిమాటోగ్రఫీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై పోలీసులు కేసు పెట్టారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్‌ ఉత్సవాలకు వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన కారులో వస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు రాగానే ఆయన కారు ఓ వ్యక్తి పాదం మీదుగా వెళ్లింది. నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్‌ అనే 32 ఏళ్ల వ్యక్తి ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. ఈ ఘటనలో సంతోష్‌ స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను వెంటనే కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. 

చికిత్స అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు.. కారు నడుపుతున్న తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్‌ పోలీసులు వెల్లడించారు. అయితే, నిన్న (నవంబరు 6)న జరిగిన సదర్ ఉత్సవంలో బాధితుడి కాలుపైకి సాయి కిరణ్ ఇన్నోవా కారు ఎక్కగానే స్థానికులు ఆందోళన చేపట్టారు. తలసాని సాయి వాహనాన్ని ముందుకు వెళ్లకుండా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందడడంతో వాహనం దిగి వచ్చిన సాయి కిరణ్ హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తానని హామీ ఇవ్వడంతో స్థానికులు అప్పుడు శాంతించారు.

Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..

ఇదిలా ఉంటే సాయి కిర‌ణ్ యాద‌వ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ప‌లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేశారు. కానీ, అప్పటి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిపై ఓటమి చెందారు. 

ఏటా దీపావళి తర్వాత సదర్
ఏటా దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం సదర్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి సదర్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సదర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తుంది. ఏటా ఈ సదర్ ఉత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యవేక్షిస్తుంటారు.

Also Read: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు

Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..

Also Read: iPhone New Feature: చిత్రలహరిలో సాయితేజ్ తయారు చేసిన ఫీచర్.. త్వరలో వచ్చే కొత్త ఐఫోన్‌లో?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Adani Group Investment: అదానీ గ్రూప్ లక్ష కోట్ల భారీ పెట్టుబడులు, 1.2 లక్షల జాబ్స్ వస్తాయన్న గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ లక్ష కోట్ల భారీ పెట్టుబడులు, 1.2 లక్షల జాబ్స్ వస్తాయన్న గౌతమ్ అదానీ
The Waking Of A Nation: 106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
106 ఏళ్ల కిందట జరిగిన దారుణ హత్యాకాండ - వెబ్ సిరీస్‌గా జలియన్ వాలాబాగ్ ఉదంతం, ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది!
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి
Embed widget