అన్వేషించండి

Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి

Tragedy at Pedakakani Goshala in Guntur | గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌తో గోశాలలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.

అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ కాళీవన ఆశ్రమం గోశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో పనికోసం వచ్చిన ముగ్గురు కార్మికులు, ఒకరు ఆశ్రమంలో ఉండే వ్యక్తి ఉన్నారు.

అసలేం జరిగిందంటే..
శ్రీ కాళీవన ఆశ్రమం గోశాలలో పేడ, వ్యర్థాలను సేకరించి సంపుల్లో వేస్తుంటారు. అవసరం ఉన్నప్పుడు గోవుల వ్యర్ధాలను తరచుగా మోటర్ ద్వారా బయటికి పంపిస్తారు. ఎప్పుడైనా సంపుల్లో పేడ గట్టిపడితే  వైబ్రేటర్‌ సాయంతో కలియబెడుతుంటారు. ఇలా రెండు, మూడు రోజులకు ఓసారి ప్రక్రియ జరుగుతుంటుంది. ఈ క్రమంలో తెనాలికి సమీపంలోని చినరావూరు గ్రామానికి చెందిన గందాళ మహంకాళిరావు అనే 28 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 24న సాయంత్రం వైబ్రేటర్‌ మెషీన్‌తో సంపులోకి దిగాడు. కానీ వైబ్రేటర్‌ విద్యుత్తు తీగ తెగడంతో మహంకాళిరావు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.


Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి

సంపులోంచి మహంకాళి రావు కేకలు వేయడంతో అది విన్న రాజేశ్‌ అనే 20 ఏళ్ల యువకుడు సంపులోకి దిగి మహంకాళి రావును పట్టుకోవడంతో అతడు సైతం విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వీరి తరువాత ఏటగిరి బాలయ్య (35), అక్కడే ఆశ్రమంలో పని చేస్తున్న శివరామకాళిబాబు (50) ఒకరి తరువాత ఒకరు సంపులోకి దిగారు. కరెంట్ షాక్ కొట్టడంతో వీరు కూడా స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగిన వారు ఎంతకూ పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి జీవన్ బాబు అనే వ్యక్తి కరెంట్ సరఫరా ఆఫ్ చేశాడు.

తీగ తెగడంతో కరెంట్ షాక్..

ఆశ్రమం నుంచి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సంపు నుంచి మృతదేహాలను పైకి తీశారు. వైబ్రేటర్ కరెంట్ తీగ తెగడంతో షాక్ కొట్టి ప్రమాదం జరిగిందని తేల్చారు. ప్రశాంతంగా ఉండే ఆశ్రమంలో నలుగురు వ్యక్తులు చనిపోవడంతో విషాదం నెలకొంది. పనికోసం వచ్చి ముగ్గురు చనిపోవడంతో మాకు ఇక దిక్కెవరు అంటూ వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఘటన కావడంతో గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎమ్మార్వో కృష్ణకాంత్‌ ఆశ్రమానికి వెళ్లి పరిశీలించారు. ఆశ్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. విద్యుత్ తీగ తెగినట్లు గుర్తించి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు.

Also Read: Anantapur Love Story: ఇద్దరమ్మాయిల్ని ప్రేమించాడు.. నిజం తెలిసి ఇద్దరూ ఒకే సారి చొక్కా పట్టుకున్నారు- అప్పుడే అసలు కథ స్టార్ట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget