By: ABP Desam | Updated at : 27 Jul 2022 12:50 PM (IST)
మూసీ బ్రిడ్జి పరిస్థితి
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో నిండిపోయాయి. చార్మినార్, బహదూర్పుర, మలక్పేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం వ్యాపించింది. బురద బాగా పేరుకుపోతోంది. ఎంజీబీఎస్, హైకోర్టు, ముసారంబాగ్ తదితర ప్రాంతాల్లో మూసీ నది ప్రవాహం ప్రమాదకర స్థితిలో ఉంది. మూసారంబాగ్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్ద ఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు మునిగిపోయాయి.
మంగళవారం రాత్రి కూడా NDRF యంత్రాంగం ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్న ఒక ఫామ్హౌస్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఒక ఫ్యామిలీని రక్షించింది. ఇందులో ఒక చంటి పిల్లవాడుతో సహా 5 గురు ఉన్నారు. ఉస్మాన్ సాగర్ 12 గేట్లను అధికారులు తెరిచారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో అధికారులు, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు మంగళవారం రాత్రి లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.బహదూర్ పురా, కిషన్ బాగ్ ప్రాంతాల్లో మూసీ నది సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు.
మరోవైపు మూసారాంబాగ్ వంతెనపై మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని కాలనీలను ఎలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ వంతనపై రాకపోకలను నిలిపివేశారు. అంబర్పేట, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గోల్నాక లేదా చాదర్ఘాట్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కు బాగా అంతరాయం ఏర్పడుతోంది. మూసీ నదీ ప్రవాహం వల్ల ఇంకా కొన్ని కాలనీలు నీటిలో నే ఉన్నాయి. అధికారులు నీటి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మూసీ వెంబడి లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
మరోవైపు, వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ప్రాంతం కూడా వరదలో చిక్కుకుంది. రికార్డు స్థాయిలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద పోటెత్తుతుండడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి 13 వేల క్యూసెక్కులను మూసీ నదిలోకి వదిలారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే, అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూకట్పల్లి, బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగుకు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మల్కాపూర్, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది.
Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!
టీచర్తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD
Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! ఏకంగా 400 పైకి - ఇవాల్టి లేటెస్ట్ రేట్స్
Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు
Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ సమ్మిట్లో పాల్గొనండి - ఏపీ సీఎం జగన్ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్ఫ్రెండ్తో ఆ సినిమా విడుదలకు ముందు...
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి