అన్వేషించండి

చారిత్రక మెట్లబావిని పున: ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్

సికింద్రాబాద్ లో బన్సీలాల్ పేట మెట్లబావి దాదాపు కనుమరుగైయ్యిందని అంతా అనుకున్నారు. వేల టన్నుల చెత్తలో చారిత్రాత్మక వైభవాన్ని ముంచేశారు. నిర్లక్ష్యానికి గురైన మెట్లబావికి తిరిగి పూర్వవైభవం వచ్చింది.

హైదరాబాద్‌లో చార్మినార్‌ వంటి అరుదైన నిర్మాణాలకు దీటుగా బన్సీలాల్ పేట మెట్లబావి పర్యాటకేంద్రం కానుంది. 300 వందల సంవత్సరాల క్రితం నాటి బన్సిలాల్ పేట మెట్లబావిని పునరుద్దరించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, GHMC, HMDA సంయుక్తంగా దీన్ని పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 8నెలలు అధికారులు, సిబ్బంది శ్రమించి ఈ బావికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. 

బన్సీలాల్ పేట మెట్లబావి కొత్త అందాలతో ముస్తాబైంది. ఈ బావిని నాగన్న కుంట బావి అని కూడా అంటారు. ఒకప్పుడు దీన్ని నీటి వినియోగానికి కూడా వాడేవారు. ఈ బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో 3శతాబ్దాల క్రితం దీన్ని నిర్మించారు. ఈ మెట్ల బావిని మున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ పున: ప్రారంభించనున్నారు. గతంలో ఒకసారి మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ప్రస్తావించారు. 

సికింద్రాబాద్ , బన్సీలాల్  పేటలోని 17వ శతాబ్ద కాలంనాటి మెట్లబావి చారిత్రాత్మక కట్టడాల్లో ఓ వినూత్న నిర్మాణం. ఏకంగా 22లక్షల త్రాగునిటిని తనలో నింపుకున్న అరుదైన కట్టడం.. అంతటి ప్రసిద్ది చెందిన బన్సీలాల్ పేట మెట్ల బావి, దాదాపు నలభై ఏళ్లపాటు పాలకుల నిర్లక్ష్యానికి పాడుబడి, పూర్తిగా కనుమరుగైయ్యే దుస్థితికి చేరుకుంది. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే స్వచ్చంద సంస్థ రంగంలోకి దిగి, జిహెచ్ ఎంసీ , తెలంగాణ ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ సమిష్టిగా ఓ మహా అద్భుతానికి తుది మెరుగులు దిద్దింది. చరిత్రలో కనుమరుగైన బన్సీలాల్ పేట మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం రానుంది. 

మెట్ల బావి నేపథ్యం ఇది...
ఒకప్పుడు ఈ మెట్లబావి ప్రాంతాన్ని నాగన్నకుంట అని కూడా అనేవారు. 2021లో పాడుబడిన స్థితిలో ఉన్న మెట్లబావి వద్ద పరిస్థితి చూసి, ఏం చేద్దాం..ఈ ప్రాంతాన్నిఎలా అభివృద్ది చేద్దామని ప్రయత్నిస్తే బావిని తిరిగి పునరుద్దరిద్దాం అనే దాని కంటే కమ్యూనిటీ హాల్,గోషాల ఇలా రకరకాల సలహలు ఇచ్చినవారే తప్ప గ్రౌండ్ వాటర్ ను రీస్టోర్ చేద్దాం, మెట్లబావికి తిరిగి ఊపిరిపోద్దాం.. భావితరాలకు భూగర్భజలాల లభ్యతకు లోటు లోకుండా చేద్దాం అనేలా ఆలోచించిన వారు తక్కువ మందే అని చెప్పవచ్చు.అయితే ఈ మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం తెచ్చి అరుదైన పర్యాటక ప్రాంతంగా తీర్చదిద్దుదాం అనే దిశగా ముందుకు సాగారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ నిర్వాహకులు. 

నలభైఏళ్లపాటు పాడుబడిన మెట్లబావి నుంచి ఏకంగా రెండువేల టన్నుల చెత్తను బయటకు తీశారు. ఈ క్రమంలో వినాయకుడు, హనుమంతుడు వంటి పురాతన విగ్రహాలు పాడుబడిన బావి నుంచి బయటపడ్డాయి. అలా ఒక్కమాటలో చెప్పాలంటే మెట్లబావికి తిరిగి కొత్తరూపు తెచ్చేందుకు ఎనిమిది నెలలపాటు ఓ మహాయజ్హమే జరిగింది.

గతంలో బావి నిర్లక్ష్యానికి గురైన తరువాత క్షణికావేశంలో చుట్టుప్రక్కలవారు ఇదే బావిలో దూకి ప్రాణాలు కోల్పోయేవారు. కొన్నాళ్లు ఓ సూసైడ్ స్పాట్ గా మారింది. ఈసారి ఆ పరిస్దితి రాకుండా బావిలోకి ఎవరూ దూకి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేకుండా చుట్టూ ఎతైన ఫెన్షింగ్ ఏర్పాటు చేసారు. బావికి ఓవైపున వ్యూవింగ్ గ్యాలరీ ఏర్పాటు చేసారు. ఇక్కడి నుంచి చూస్తే బావి చూట్టూ ఓ సుందర ఆహ్లాదరక వాతావారణం ఉండేలా గ్రీనరీతో, లైటింగ్, అండర్ వాటర్ లైటింగ్, నైట్ ఎఫెక్ట్స్, స్టీట్ లైటింగ్‌తో తీర్చి దిద్దారు. 

నగరానికి వచ్చే పర్యాటకులకు కచ్చితంగా ఓసారి చూడాలనిపించేలా అత్యంత సుందరంగా, అద్భతంగా మెట్లబావికి పర్యాటక సొగసులు జోడించారు. ఇక్కడకు వచ్చేవారు, స్కూల్ విద్యార్దులు మెట్లబావి చరిత్రను తెలసుకునేలా ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.ఇలా ఒకప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఈ చారితాత్మక కట్టడానికి తిరిగి పూర్వవైవం తేవడమే కాదు ,భవిష్యత్ లో బావి నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget