అన్వేషించండి

KTR: కాంగ్రెస్ చేతగానితనం, గుజరాత్ తరలిపోతున్న కేన్స్ సంస్థ: కేటీఆర్

Telangana News | కర్ణాటక నుంచి కేన్స్ సంస్థను ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో గుజరాత్ కు సంస్థ తరలిపోతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Kaynes Semicon advanced semiconductor making unit | హైదరాబాద్: తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోవడం నిజమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేసి తర్వాత రాష్ట్ర మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. కేన్స్ సంస్థ ఎక్కడికి తరలిపోలేదని, తెలంగాణ (Telangana)లోనే ఉంటుందన్నట్లుగా ప్రకటన చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి వారికి అన్ని అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

రెండు యూనిట్లు గుజరాత్‌కు తరలిపోతున్నాయి

మొత్తం మూడు యూనిట్లలో ఒకటి సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్. కొంగర్ కలాన్ లో అత్యంత ఆధునాతమైన (OSAT) ఏర్పాటు చేయాల్సి ఉంది. PCB యూనిట్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు కేన్స్ కంపెనీని ఒప్పించినట్లు ఓ ప్రకటనలో కేటీఆర్ తెలిపారు. అయితే  కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేయాల్సిన (OSAT) గుజరాత్ కు తరలిపోయిందని పేర్కొన్నారు. ఇక వరంగల్ లో ఏర్పాటు చేయాల్సిన PCB యూనిట్ పై స్పష్టత లేదన్నారు. కేన్స్ సంస్థ సాధారణ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మాత్రమే కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్లే ఇలా జరిగిందన్నారు కేటీఆర్.  

అది జరిగింటే, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉండేదన్న కేటీఆర్
ముందు అనుకున్నట్లుగా కొంగర్ కలాన్ లో (OSAT) ను ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్ లో మంచి భవిష్యత్ ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం మూడు యూనిట్లు తెలంగాణలో ఏర్పాటుకు తాము ఒప్పించినా.. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో కీలకమైన (OSAT), PCB యూనిట్లు తెలంగాణ నుంచి తరలిపోతున్నాయన్నది వాస్తవం. కానీ ఏమీ జరగలేదన్నట్లుగా మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రెండు పెద్ద ప్రాజెక్ట్ లను రాష్ట్రం కోల్పోయింది. 

Also Read: జైనూర్‌లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు! 144 సెక్షన్ కూడా - జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో పెట్టుబడి దారులు అయోమయానికి గురవుతున్నారని, అందుకు కేన్స్ సంస్థ యూనిట్లు ఇక్కడి నుంచి తరలిపోవడమే నిదర్శనమని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.  అతి సాధారణమైన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఇక్కడ పెడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇదొక్కటి చెప్పి. అసలు కేన్స్ సంస్థ ఎటు తరలిపోలేదంటూ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇలా చెప్పడం ప్రజలను మోసం చేయటమేనని.. ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఓ ప్రకటనలో కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆరఎస్ హయాంలో హైదరాబాద్ ను దేశంలో ప్రముఖ ఐటీ హబ్ గా చేసేందుకు కృషిచేయగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కంపెనీలు సైతం వేరే చోటుకు తరలిపోతున్నాయని ఆరోపించారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget