అన్వేషించండి

G Kishan Reddy: గోషామహల్ బీజేపీ టికెట్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిలిండర్ తగ్గింపు ధరలపైన కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాఖీ కానుకగా సిలిండర్ ధరపై 200 తగ్గింపు ఆనందకరం అని అన్నారు.

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆ స్థానం నుంచి టికెట్ ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్ణయం పూర్తిగా ఢిల్లీలోని అధిష్ఠానం తీసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దీనికోసం ఎలక్షన్ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సమావేశం అయిన తర్వాత అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తామని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిలిండర్ తగ్గింపు ధరలపైన కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాఖీ కానుకగా సిలిండర్ ధరపై 200 తగ్గింపు ఆనందకరం అని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు తక్కువ చేశాయని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబరు 17 తర్వాత తాము రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతామని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని అన్నారు. తమది కేడర్ ఆధారిత పార్టీ అని.. బీఆర్ఎస్ తరహాలో కుటుంబ పార్టీల డైనింగ్ టేబుల్‌పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమని అన్నారు. కేడర్‌తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. 

గోషామహల్ టికెట్ పై రాజాసింగ్ వ్యాఖ్యలు ఇవీ

బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయలు పక్కన పెడతా కానీ.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని రాజా సింగ్ స్పష్టం చేశారు.  తెలంగాణ హిందూ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని రాజా సింగ్ పేర్కొన్నారు. బీజేపీ అధిస్టానం తనకు సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  టికెట్‌ ఇవ్వకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గోషా మ‌హాల్ స్థానానికి బిఆర్ఎస్ అభ్య‌ర్ధి ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఆయన సెటైర్లు వేశారు.  ఆ సీటు ఎవ‌రికి కేటాయించాల‌నేది ఎంఐఎం నిర్ణ‌యిస్తుంద‌ని ఎద్దేవా చేశారు.. మ‌జ్లిస్ పార్టీ సూచించిన అభ్య‌ర్ధే ఇక్క‌డ కారు గుర్తుపై పోటీ చేస్తార‌ని తెలిపారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారన్నారు.  దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారన్నారు. 

జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఒత్తిడి?

గోషామ‌హ‌ల్ స్థానాన్ని వ‌దులుకొని, 2024 సార్వత్రిక ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ లోక్‌స‌భ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల‌ని రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్న‌ట్లుగా ప్రచారం జరుగుతోంది.  జ‌హీరాబాద్ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే స‌స్పెన్ష‌న్ తొల‌గించే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అధిష్టానం రాజాసింగ్‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న స‌స్పెన్ష‌న్‌పై జాప్యం జ‌రుగుతోంద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.  గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున మాజీ మంత్రి, దివంగ‌త ముకేశ్ గౌడ్ కుమారుడు విక్ర‌మ్ గౌడ్‌ను పోటీ చేయాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో గోషామ‌హ‌ల్‌ను వ‌దిలిపెట్టాల‌ని రాజాసింగ్‌కు అధిష్టానం సూచించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget