అన్వేషించండి

BRS Party: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కీలక నేతలు హస్తినకు పయనం !

BRS Party: దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 14వ తేదీ అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు.

BRS Party: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈనెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు పనులను సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు తాజాగా పరిశీలించారు.

ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, రాములు, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కకడి నుంచి తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో చర్చించారు. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. 

శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో యాగాలు..

అయితే మంగళ, బుధ వారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మూడు రోజులుగా.. యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరి పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సంతోష్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. 

450 మందికి పైగా ప్రతినిధులతో కార్యక్రమం..

మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు.. అందుకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫర్మిచర్ ను ఇప్పటికే అక్కడికి చేర్చారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మిగిలిన ఆహ్వానితులు సమయానికి వెళ్లనున్నారు. 

ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం..

అలాగే పార్టీ ప్రారంభోత్సవానికి డేడీఎస్ అధ్యక్షుజు కుమార స్వామితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిళేష్ యాదవ్, బిహీర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటులు ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులను ఆహ్వానించారు. నెల 14వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తారు. అదే రోజు మధ్యాహ్నం జాతీయ మీడియాతో జరిగే భేటీలో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని వివరించనున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vishwak Sen Party Nandamuri  Balakrishna | లైలా, టిల్లూతో డాకూ పార్టీ | ABP DesamHaimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Embed widget