అన్వేషించండి

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR: ప్రజల కోసం బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. టీఆర్ మాత్రం దాడులు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను వారి సమస్యలను గాలికొదిలేయడం దారుణం అన్నారు. 

Kishan Reddy Fires on KCR: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ పోరాటలతో అధికారంలోకి వచ్చి.. అవే పోరాటాలను అణిచివేస్తోందని అన్నారు. ఇలాంటి సర్కారు అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పాదయాత్ర చేస్తుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫిల్మ్ నగర్ లో జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 

భాగ్యనగరంలో సవాలక్ష సమస్యలు ఉండగా.. నూతన సచివాలయ నిర్మాణం అవసరమా..! 

రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కుటుంబ పాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. బీజేపీ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి ఆయువు పట్టు హైదరాబాద్ అని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికీ ఏం చేయలేకపోయారని అన్నారు. హైదరాబాద్ లో రోడ్ల సమస్యలు, కలుషిత నీరు, ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ఇలా సవాలక్ష సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ... కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పడం ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. 

ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్రో నిర్మాణం పూర్తి చేయండి..

సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని దాన్ని ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం మెట్రో కోసం రూ.1,250 కోట్ల మెట్రోకి ఇచ్చి అఫ్జల్ గంజ్ వరకే మెట్రోను తీసుకెళ్తూ... పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మెట్రో రైలు ప్రాజెక్టును యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా పనులు పూర్తి చేస్తామని ఓ మంత్రి చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన సహకారం మేరకు ముందుగా పాత లైన్ పూర్తి చేయండని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget