అన్వేషించండి

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR: ప్రజల కోసం బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. టీఆర్ మాత్రం దాడులు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను వారి సమస్యలను గాలికొదిలేయడం దారుణం అన్నారు. 

Kishan Reddy Fires on KCR: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ పోరాటలతో అధికారంలోకి వచ్చి.. అవే పోరాటాలను అణిచివేస్తోందని అన్నారు. ఇలాంటి సర్కారు అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పాదయాత్ర చేస్తుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫిల్మ్ నగర్ లో జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 

భాగ్యనగరంలో సవాలక్ష సమస్యలు ఉండగా.. నూతన సచివాలయ నిర్మాణం అవసరమా..! 

రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కుటుంబ పాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. బీజేపీ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి ఆయువు పట్టు హైదరాబాద్ అని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికీ ఏం చేయలేకపోయారని అన్నారు. హైదరాబాద్ లో రోడ్ల సమస్యలు, కలుషిత నీరు, ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ఇలా సవాలక్ష సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ... కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పడం ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. 

ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్రో నిర్మాణం పూర్తి చేయండి..

సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని దాన్ని ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం మెట్రో కోసం రూ.1,250 కోట్ల మెట్రోకి ఇచ్చి అఫ్జల్ గంజ్ వరకే మెట్రోను తీసుకెళ్తూ... పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మెట్రో రైలు ప్రాజెక్టును యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా పనులు పూర్తి చేస్తామని ఓ మంత్రి చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన సహకారం మేరకు ముందుగా పాత లైన్ పూర్తి చేయండని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget