అన్వేషించండి

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR: ప్రజల కోసం బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. టీఆర్ మాత్రం దాడులు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను వారి సమస్యలను గాలికొదిలేయడం దారుణం అన్నారు. 

Kishan Reddy Fires on KCR: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ పోరాటలతో అధికారంలోకి వచ్చి.. అవే పోరాటాలను అణిచివేస్తోందని అన్నారు. ఇలాంటి సర్కారు అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పాదయాత్ర చేస్తుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫిల్మ్ నగర్ లో జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 

భాగ్యనగరంలో సవాలక్ష సమస్యలు ఉండగా.. నూతన సచివాలయ నిర్మాణం అవసరమా..! 

రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కుటుంబ పాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. బీజేపీ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి ఆయువు పట్టు హైదరాబాద్ అని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పటికీ ఏం చేయలేకపోయారని అన్నారు. హైదరాబాద్ లో రోడ్ల సమస్యలు, కలుషిత నీరు, ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ఇలా సవాలక్ష సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ... కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పడం ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. 

ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్రో నిర్మాణం పూర్తి చేయండి..

సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని దాన్ని ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం మెట్రో కోసం రూ.1,250 కోట్ల మెట్రోకి ఇచ్చి అఫ్జల్ గంజ్ వరకే మెట్రోను తీసుకెళ్తూ... పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మెట్రో రైలు ప్రాజెక్టును యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా పనులు పూర్తి చేస్తామని ఓ మంత్రి చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన సహకారం మేరకు ముందుగా పాత లైన్ పూర్తి చేయండని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
Pakistani Taliban: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
Embed widget