అన్వేషించండి

Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కారణాలతో హత్యలకు గురైన వారికి ఉద్యోగాలు, స్థలాలు, పొలాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Andhra Government compensation for victims of crimes: ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రభుత్వాన్ని నడిపేవారు ప్రభుత్వానికి ఓనర్లు కాదు. వారు తమ  బాధ్యతలను చట్టప్రకారం నిర్వహించాల్సిందే. అయితే ఇటీవలి ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. రాజకీయ కారణాలతో ఇతరులకు సాయం చేయడానికి ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వివాదాస్పదం అవుతోంది.   ఏదైనా రాజకీయ గొడవల బాధితులకు పరిహారాలు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. రాజకీయ కారణాలతో ఒత్తిళ్లతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు కారణం అవుతోందది. 

తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

వైఎస్ఆర్‌సీపీ హయాంలో  మాచర్ల నియోజకవర్గంలో  తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. అప్పట్లో ఈ  హత్య సంచలనం సృష్టించింది. చంద్రబాబునాయుడు స్వయంగా వెళ్లి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చంద్రయ్య కుమారుడికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సాధ్యం కాదు కాబట్టి అసెంబ్లీలో ఆమోదించారు. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది కాబట్టి ఆ నిర్ణయం పెండింగ్ లో పడిపోయింది. ఇంకో సారి మండలికి పంపితే.. ఆమోదం లేకపోయినా ఉద్యోగం వస్తుంది.ప్రభుత్వ సర్వీసులో ఉండి.. ప్రజల కోసం పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే సంప్రదాయం ఈ నియామకంతో మారిపోతుంది. రేపు మరో పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాలు తమ పార్టీ నేతలకు.. అవసరమైన వారికి ఇచ్చుకునే సంప్రదాయం పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన ఉంది. 

కందుకూరు ఘటనలో బాధితులకు పొలం, పరిహారం

కందకూరు లక్ష్మినాయుడు అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అన్న అభిప్రాయం ఉంది. కానీ అది కులం కోణం తీసుకుంది. చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి వేర్వేరు కులాలు. ఆ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న రాజకీయం ప్రారంభం కావడంతో చంద్రబాబు ఒత్తిడికి గురయ్యారు. ఆ కుటుంబానికి శరవేగంగా న్యాయం చేసేందుకు హోంమంత్రిని కూడా కందుకూరు పంపారు. నెల్లూరు మంత్రి నారాయణ, హోంమంత్రి పరామర్శించారు. వారి సూచనల మేరకు లక్ష్మినాయుడు భార్య  ఇద్దరు పిల్లలకు తలా రెండు ఎకరాల చొప్పున ఆరెకరాలు, దాడిలో గాయపడిన లక్ష్మినాయుడు సోదరుడికి ఐదు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఈ జాబితాలో ఉంది. 

కొట్టుకు చస్తే ప్రజాధనం ఇస్తారా అన్న విమర్శలు 

నేరాల్లో చనిపోయిన వారి  కుటుంబానికి ఎకరాలకు ఎకరాలు.. లక్షలకు లక్షలు ఇవ్వాల్సిన పని లేదని..  వారికి న్యాయం చేయడం అంటే.. నిందితులకు శిక్ష పడేలా చేస్తే సరిపోతుందని అభిప్రాయం వినిపిస్తోంది.  కందుకూరు పోలీసులు హంతకుడి కుటుంబ ఆస్తిని జప్తు చేసి బాధితులకు ఇచ్చేందుకు కోర్టుకు వివరాలు సమర్పించారు కానీ ప్రజాధనం ఎందుకివ్వాలన్న ప్రశ్న వస్తోంది. ఏడాదికి 9వేల హత్యలు జరుగుతాయని..అందరికీ పరిహారం ఇస్తారా అని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. 

అన్ని హత్యలకూ రాజకీయ రంగు పులిమితే ?
 
ఇప్పుడు హత్యల్ని హత్యల్లా చూడకుండా  నష్టపరిహారం ప్రతి హత్యకూ కులం రంగు పులిమే ప్రమాదం కనిపిస్తోంది.   ప్రభుత్వం ప్రజాధనం సాయంగా చేసిన రెండు సందర్భాల్లోనూ విమర్శలకు కారణం అవుతున్నాయి. పాలకులు మరింత జాగ్రత్తగా ప్రజాధనం, ఆస్తుల విషయంలో ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఒత్తిడికి లోనై సీఎం చంద్రబాబు ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.   

 

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget