అన్వేషించండి

Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam

భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? అని అడిగితే.. మనందరం జవహర్‌లాల్ నెహ్రూ అని చెప్తాం.. కానీ నెహ్రూ కాదు.. స్వతంత్ర భారతదేశ ప్రభుత్వానికి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నేనంటే.. అవును మొట్టమొదటి స్వాతంత్ర భారతదేశ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసే. కానీ అదెలా? పదండి ఈ రోజు ఇండియా మాటర్స్‌లో తెలుసుకుందాం.


నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు చెబితేనే భారతీయుల గుండెల్లో దేశ భక్తి ఉప్పొంగుతుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ ఫైట్‌లో ఓ అన్‌సంగ్ హీరోగా.. ఆఖరి శ్వాస వరకు భరతభూమి కోసం పోరాడిన వీరుడిగా ప్రతి భారతీయుడి మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు నేతాజీ. తన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో బ్రిటిషర్ల గద్దెని కదిలించి.. భారతదేశానికి స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపిరులూదారు. కేవలం ఆజాద్ హింద్ ఫౌజ్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిషర్లతో పోరాడటమే కాదు.. బ్రిటిషర్లకి కౌంటర్‌గా మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చేసింది కూడా నేతాజీనే. ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రితో పాటు.. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను కూడా నేతాజీనే నిర్వహించారు. ఇంకో విషయం తెలుసా? ఈ ప్రభుత్వాన్ని నేతాజీ ఏర్పాటు చేసింది అక్టోబర్‌లోనే. 

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. 1942లో సింగపూర్‌లో కెప్టెన్ మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు, కానీ తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యానికి నాయకుడిగా మారారు. ఈ ఆర్మీ మెయిన్ టార్గెట్ భారతదేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి ప్రసాదించి.. బ్రిటిష్ పాలనను తరిమికొట్టడమే. ఈ సైన్యంలో “రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్” అనే మహిళా రెజిమెంట్‌తో సహా దాదాపు 85 వేల మంది భారతీయ సైనికులు ఉండేవారు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌కి జపాన్ భారీగా మద్దతిచ్చింది. జపాన్ సపోర్ట్‌తోనే అక్టోబర్ 21, 1943న నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని కూడా స్థాపించారు. దీనిని అనేక దేశాలు కూడా గుర్తించాయి. INA మయన్మార్, ఇంఫాల్ సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. చివరికి ఈ సైన్యం యుద్ధంలో ఓడిపోయినా.. ఆజాద్ హింద్ ఫౌజ్ త్యాగం, ధైర్యం భారతీయ ప్రజలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం గద్దె ఈ సైన్యం దెబ్బకు కదలింది అంటే నేతాజీ సైన్యం చేసిన పోరాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సైన్యం పోరాటమే స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికీ నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని దేశభక్తి, ధైర్యానికి చిహ్నాలుగా భారతీయులంతా చెప్పుకుంటారు. అంతేకాదు.. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నడిపే టైంలో.. నేతాజీ ఇచ్చిన “జై హింద్”, “నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను” వంటి నినాదాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నినాదాలు ఇప్పటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయి. 

ఏది ఏమైనా.. భారతదేశ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్టోబర్ 21నే. అది సింగపూర్‌లో నేతాజీ ఏర్పాటు చేసి.. దానికి నేతాజీ ప్రధానిగా ఉన్నారు. అందుకే అక్టోబర్ 21 భారతీయులకి అంత ఇంపార్టెంట్. సో.. ఇది ఇవ్వాళ్టి ఇండియా మాటర్స్. మరి నెక్ట్స్ వీక్ ఇంకో వీడియోతో మీముందుకొస్తాను. అప్పటి వరకు జైహింద్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HeatWave 2026: వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy strategy 2026: రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
Women Reservation AP: ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Drishyam 3 Collections: 'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
Chandrayaan-2 Discovery Ice on Moon:చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
Trump Threatens Oman:ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
Embed widget