అన్వేషించండి

Telangana News: ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం- దసరా బోనస్‌పై కేటీఆర్

Telangana Singareni Bonus | తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్ లో అన్యాయం చేసిందని, సగం మొత్తమే ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR Comments on Bonus for Singareni Workers | హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల దసరా బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికుల ప్రయోజనం కోసం బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్ కాదని, బోగస్ అని సంస్థ లాభాల్లో 20 శాతం మాత్రమే పంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

కాంగ్రెస్‌ అధికారంలో 20 శాతం లాభాలు మించలేదు

హైదరాబాద్‌లో ఆదివారం నాడు (సెప్టెంబర్ 22న) నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ హయాంలో సింగరేణి సంస్థ ఎన్నో విజయాలు సాధించిందని, ఎన్నో మైలురాళ్లు చేరుకుందన్నారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని కేటీఆర్ చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సింగరేణిలో రూ.1,060 కోట్లు లాభాలు వచ్చాయి. ఆ ఏడాది అంటే 2014-15లో రూ.102 కోట్లకు పైగా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇచ్చాం. అనంతరం సంస్థ మరింత అభివృద్ధి చెందగా.. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. ఆ ఏడాది ఒక్కో సింగరేణి కార్మికుడికి 1 లక్ష చొప్పున బోనస్ అందించాం. 

రూ.17 వేల నుంచి రూ.1.60 లక్షలకు పెంచామన్న కేటీఆర్

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.17 వేలు ఇస్తే.. పదేళ్లలో లాభాలు పెంచుతూ పోయి 2023 నాటికి ఒక్కో కార్మికుడికి 1.60 లక్షలు దసరా బోనస్ ఇచ్చాం. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్‌ కాదు, అంతా బోగస్‌‌లా కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి దసరా బోనస్ ప్రకారం సింగరేణి ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు వస్తాయి. దాంతో వారికి రూ.1.80 నష్టం కలగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో రూ.4,701కోట్ల లాభాలు వచ్చాయన్నారు. అందులో 33 శాతం వాటా కార్మికులకు ప్రకటించారు. అంటే రూ.1,551కోట్లను కార్మికులకు పంచాలి. ఆ లెక్కన చూస్తే ఒక్కో కార్మికుడికి రూ.3.70లక్షలు దసరా బోనస్ రావాలి. కానీ ప్రభుత్వం లక్షా తొంబై వేలు మాత్రమే బోనస్‌గా ప్రకటించింది. 

ప్రభుత్వం పంచింది కేవలం 16.2 శాతం లాభాల్లో వాటా, కాగా 33 శాతం లాభాలను కార్మికులను పంచామంటూ మభ్యపెడుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే కార్మికులను చేసే న్యాయం ఇదేనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా అడుగులే వేస్తోంది. అందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం కార్మికులకు అండగా నిలిచి సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని’ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Also Read: Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget