అన్వేషించండి

Telangana News: ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం- దసరా బోనస్‌పై కేటీఆర్

Telangana Singareni Bonus | తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్ లో అన్యాయం చేసిందని, సగం మొత్తమే ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR Comments on Bonus for Singareni Workers | హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల దసరా బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికుల ప్రయోజనం కోసం బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్ కాదని, బోగస్ అని సంస్థ లాభాల్లో 20 శాతం మాత్రమే పంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

కాంగ్రెస్‌ అధికారంలో 20 శాతం లాభాలు మించలేదు

హైదరాబాద్‌లో ఆదివారం నాడు (సెప్టెంబర్ 22న) నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ హయాంలో సింగరేణి సంస్థ ఎన్నో విజయాలు సాధించిందని, ఎన్నో మైలురాళ్లు చేరుకుందన్నారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని కేటీఆర్ చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సింగరేణిలో రూ.1,060 కోట్లు లాభాలు వచ్చాయి. ఆ ఏడాది అంటే 2014-15లో రూ.102 కోట్లకు పైగా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇచ్చాం. అనంతరం సంస్థ మరింత అభివృద్ధి చెందగా.. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. ఆ ఏడాది ఒక్కో సింగరేణి కార్మికుడికి 1 లక్ష చొప్పున బోనస్ అందించాం. 

రూ.17 వేల నుంచి రూ.1.60 లక్షలకు పెంచామన్న కేటీఆర్

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.17 వేలు ఇస్తే.. పదేళ్లలో లాభాలు పెంచుతూ పోయి 2023 నాటికి ఒక్కో కార్మికుడికి 1.60 లక్షలు దసరా బోనస్ ఇచ్చాం. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం కార్మికులకు ప్రకటించింది దసరా బోనస్‌ కాదు, అంతా బోగస్‌‌లా కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి దసరా బోనస్ ప్రకారం సింగరేణి ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు వస్తాయి. దాంతో వారికి రూ.1.80 నష్టం కలగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో రూ.4,701కోట్ల లాభాలు వచ్చాయన్నారు. అందులో 33 శాతం వాటా కార్మికులకు ప్రకటించారు. అంటే రూ.1,551కోట్లను కార్మికులకు పంచాలి. ఆ లెక్కన చూస్తే ఒక్కో కార్మికుడికి రూ.3.70లక్షలు దసరా బోనస్ రావాలి. కానీ ప్రభుత్వం లక్షా తొంబై వేలు మాత్రమే బోనస్‌గా ప్రకటించింది. 

ప్రభుత్వం పంచింది కేవలం 16.2 శాతం లాభాల్లో వాటా, కాగా 33 శాతం లాభాలను కార్మికులను పంచామంటూ మభ్యపెడుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే కార్మికులను చేసే న్యాయం ఇదేనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా అడుగులే వేస్తోంది. అందుకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం కార్మికులకు అండగా నిలిచి సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని’ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Also Read: Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget