అన్వేషించండి

Harish Rao: పనులు చేయిస్తారు ఫుడ్ పెట్టరు, సన్నబియ్యం అమ్మవార్లకు దొడ్డుబియ్యం పిల్లలకు- హరీష్‌ ముందు బోరుమన్న గురుకుల విద్యార్థులు

Telangana News: విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని హరీష్ ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ ఫుడ్‌ పాయిన్ కేసులు వస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Telangana News: తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, చదువు, ఫుడ్‌, ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. 

పాఠశాలలో సరైన ఫుడ్ పెట్టడం లేదని హరీష్‌రావు దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు, తమతోనే వంట చేయిస్తున్నారని సరైన వసతులు లేవని అడిగితే తిడుతున్నారని కొడుతున్నారని వాపోయారు. తమకు ఎదురవుతున్న సమస్యలు చెప్పుకొని బోరున విలపించారు విద్యార్థులు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే స్పందించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు. అసలు సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి పెట్టే తీరక సీఎంకు ఉందా లేదా అని ధ్వజమెత్తారు. 

ఇన్ని సమస్యలు గురుకుల పాఠశాలల్లో ఉంటే సీఎంకు చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు హరీష్‌. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి దిగజార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. 

గురుకుల విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే వారి బాధ చూసి తట్టుకోలేక తెలుసుకునేందుకు తాము వచ్చామన్నారు హరీష్‌. వచ్చిన తర్వాత పిల్లలు తమ దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారని భయంతో వణికిపోతున్నారని తెలిపారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని వాపోయారు. అన్నంలో, పప్పులో పురుగులు ఉంటే తింటే తినండి లేకుంటే మానేయండీ అంటూ సిబ్బంది రుబాబు చేస్తున్నారని విద్యార్థులు తెలియజేసినట్టు వివరించారు. 
ఇప్పటి వరకు గురుకుల విద్యార్థులకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని తెలిపారు హరీష్‌. రెండో జత బట్టలు, పుస్తకాలు కూడా ఇవ్వలేదని ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు సన్నబియ్యంతో అన్నం పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం గొడ్డు కారంతో పెడుతున్నారని మండిపడ్డారు. గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

పాఠశాలలో తరగతి గదులు ఊడ్చేపని నుంచి వంట వరకు అన్ని పనులు తమతో చేయిస్తున్నారని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫుడ్ మాత్రం సరిగా పెట్టడం లేదని వాపోయారు. ఇలాంటివి ఎవరికైనా చెబితే కర్రలు విరిగేలా కొడుతుంటారని ఈ టీచర్స్ మాకు వద్దని పిల్లలంతా బోరుమన్నారు. వారిని హరీష్‌, సబితా ఇంద్రారెడ్డి బోదరించి ధైర్యం చెప్పారు. వాళ్లకు ఇద్దరి ఫోన్ నెంబర్లు విద్యార్థులకు ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు. 

ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే 500 మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారని... 38 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్‌. పాములు కరిచి, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని, మైనార్టీ గురుకులాలు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget