అన్వేషించండి

Bandi Sanjay: రాత్రికి రాత్రే తరలిస్తారా? అన్నీ అనుమానాలే! నిరసనలకు బండి సంజయ్ పిలుపు

సర్దార్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన హైదరాబాద్‌లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ప్రజాభిప్రాయం బీజేపీ వైపే ఉందని, దాంతో టీఆర్ఎస్ పార్టీ తన అధికార బలంతో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా నిన్న అర్ధరాత్రి ఈవీఎంలను తరలించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాత్రికి రాత్రే వీవీప్యాట్ మెషిన్లను తరలించేందుకు యత్నించారని మండిపడ్డారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా కేంద్రాలలో నేడు (అక్టోబరు 31) గాంధీ విగ్రహాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన తెలపాలని పిలుపునిచ్చారు.

వీవీప్యాట్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని కారులో ఎట్లా తరలిస్తారని ప్రశ్నించారు. ‘‘అసలు వీవీప్యాట్ పనిచేయడం లేదనడానికి మీరు ఎవరు? అది పనిచేయడం లేదని మీరెలా నిర్ధారించారు? ఎవరికి చెప్పకుండా ఎలా తరలిస్తారు? నిజంగా పనిచేయకపోతే పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? దీనిపై మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిందే’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

పటేల్ విగ్రహానికి నివాళులు
సర్దార్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన హైదరాబాద్‌లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పటేల్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ‘‘1947 స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో సర్దార్ పటేల్ హోంమంత్రిగా కాకుండా ఉండి ఉంటే తెలంగాణ పాకిస్తాన్‌లో కలిసేదేమో! నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్గించడానికి సర్దార్ పటేల్ మార్గదర్శనంలో భారతసైన్యం సాహసోపేతంగా పోలీస్ యాక్షన్ జరిగింది. దీని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. లేకుంటే పాకిస్తాన్‌లో కలిసేదే.

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన జరిగింది.. సర్దార్ పటేల్ యొక్క పోలీసు చర్యల కారణంగానే. ఇదేదో కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతోనో... కాంగ్రెస్ సత్యాగ్రహాలతోటో తెలంగాణ విమోచన జరగలేదు. అందుకే తెలంగాణ ప్రజలందరు సర్దార్ పటేల్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ మహనీయుడి సాహసోపేత, కఠిన నిర్ణయాల కారణంగా బ్రిటీష్ కాలంలోని 562 సంస్థానాలు స్వంతంత్ర భారతదేశంలో విలీనం అయ్యాయి. అందుకే ఈ దేశం యొక్క ఏకాత్మతను, సమగ్రతను, అఖండతను కాపాడిన సర్దార్ పటేల్ గారు చిరస్మరణీయులు. 

Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది

అయితే తెలంగాణ గడ్డకు విమోచన కల్గించిన సర్దార్ పటేల్ గారి జయంతి కార్యక్రమంలో కేసీఆర్ మాత్రం పాల్గొనడు. ఉద్యమకాలంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేక పోరాటం గురించి కథలుకథలుగా చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాంను పొగడడం దురదృష్టకరం. సర్దార్ పటేల్ లేకుంటే కేసీఆర్ చాంద్ పాషా అయ్యేవాడు. కేసీఆర్ దేశభక్తుల విషయంలో వహిస్తున్న నిర్లక్ష్య తీరును బీజేపీ ఖండిస్తోంది. కేసీఆర్ వ్యవహారశైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అవసరమొచ్చినప్పుడు సరైన బుద్ధి చెబుతారు.’’ అని బండి సంజయ్ మాట్లాడారు.

Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !

Also Read: తెలంగాణలో రాజకీయ శూన్యత... అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి... మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget