అన్వేషించండి

Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు నిధుల మళ్లింపు కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంది.

Formula E Race Case | హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కీలక అడుగు వేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో అధికారులు సోమవారం (మార్చి 23న) ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్నారు.  ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ (A2), హెచ్‌ఎండీఏ మాజీ అధికారి బి.ఎల్.ఎన్ రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వర్‌రావు (A4),  బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవో సంస్థ (A5)లను ఈ కేసులో నిందితులుగా ఏసీబీ తమ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. 

క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ ఛార్జ్‌షీటులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు ఫార్ములా ఈ కారు రేస్ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించినందుకుగానూ ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.45 కోట్లు అందాయని ఏసీబీ చెబుతోంది. ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లోనే ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి ఇచ్చిన తరువాత విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది.

కాగా, ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. నగదు సంబంధిత అంశం కావడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్ర జరిగిందని ఏసీబీ ఛార్జిషీట్‌లో పేర్కొనడంతో కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది.

అసలేం జరిగిందంటే..
బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. హుస్సేన్ సాగర్ వద్ద రేసు నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్, మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) మధ్య 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణపై ఒప్పందం జరిగింది. రేసుల నిర్వహణతో పాటు ట్రాక్ నిర్మాణం కోసం సదుపాయాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించగా.. ఎఫ్‌ఈవో, ఏస్ నెక్స్ జెన్ సంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. తమకు డబ్బులు చెల్లించని కారణంగా రేస్ నిర్వహించడం లేదని యూకే సంస్థ ఎఫ్ఈవో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. 

అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఏఎండీ, ఎఫ్ఈవోల మధ్య 2023 అక్టోబర్ లో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం రూ.110 కోట్లు చెల్లించాలని ఎఫ్ఈవో ఒప్పందం చేసుకుంది. మరో 50 కోట్లు సైతం నిధులు విడుదల చేశారు. అయితే  ఆర్బీఐ నిబంధనలను కాదని, హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.160 కోట్లు కేటాయించడం, అందులో రూ.45 కోట్లకు పైగా విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఐటీ శాఖ కూడా గతంలో హెచ్ఎండీఏకు రూ.8 కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపి, మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు.

రేసు నిర్వహించింది విదేశీ సంస్థ కావడంతో ఆ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించి వివరాలను ఛార్జిషీటులో పొందుపరిచారు. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఏసీబీ పేర్కొంది. మాజీ మంత్రి కావడంతో కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం నుంచి అనుమతి వేచిచూడాల్సి వచ్చింది. సంబంధిత వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించిన తర్వాత ఏసీబీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. సోమవారం నాడు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు

వీడియోలు

Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్
Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Papaya Leaf Juice : బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Embed widget