అన్వేషించండి

Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

Minister KTR : కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపింటారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Minister KTR : టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని, నిధులు ఇవ్వకుండా ఆగం చేస్తుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం అన్నీ చేస్తుందని అయినా రాజకీయాల కోసం టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు సమయం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. అవార్డులు, నిధులు, కాలేజీలు అంశం ఏదైనా సరే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు కొనసాగుతోంది. తాజాగా మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయకముందే బీజేపీ జాతీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అక్టోబర్ 15 లోపు ఉపఎన్నిక ఉంటోందని ప్రకటించేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేశారు. 

బీజేపీ పేరు ఇలా మార్చేయండి

బీజేపీ తీరుపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. "ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే బీజేపీ నేతలు ఎన్నికల తేదీలు చెప్పేస్తారు, ఈడీ కన్నా ముందే ఎక్కడ సోదాలు జరుగుతాయో బీజేపీ చెప్పేస్తుంది, ఎన్ఐఏ నిషేధం ప్రకటించకముందే బీజేపీ ఆయా సంస్థలను నిషేధిస్తుంది, ఐటీ, సీబీఐ దాడులకు ముందే బీజేపీ నిందితుల పేర్లు చెప్పేస్తుంది "అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన డైరెక్షన్ పెట్టుకుని ఆడిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయో ముందుగానే బీజేపీ నేతలు చెప్పేస్తారని, బీజేపీ సర్కార్ డైరెక్షన్ లో కేంద్రం సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే బీజేపీని "BJ...EC-CBI-NIA-IT-ED...P" ఇలా మార్చుకోవాలని సూచించారు. 

కిషన్ రెడ్డికి కౌంటర్ 

మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర సర్కారు నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదాని పట్టిస్తోందని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్తగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 9 మెడికల్ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే మెడికల్ కాలేజీల విషయంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. శనివారం ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిపై, కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు బీజేపీ నాయకులు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంత్రిని నేనెప్పుడు చూడలేదని కేటీఆర్ అన్నారు. సోదరుడిగా మిమ్మల్ని గౌవిస్తాను కానీ.. మీరు చెప్పింది పూర్తిగా తప్పు అని ఘాటుగా జవాబు ఇచ్చారు.  ' గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారూ.. ఓ సోదరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తా, కానీ మీలా అసత్యాలు ప్రచారం చేసే కేంద్ర మంత్రిని నేను చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలను కేటాయించిందంటూ మీరు ప్రకటించింది పచ్చి అబద్ధం. మీకు ఈ అంశంలో క్షమాపణలు అడిగే ధైర్యం లేదు' అని కేటీఆర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 

 Also Read : KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్

Also Read : KCR National Politics : దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !

టాప్ హెడ్ లైన్స్

HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Breaking News: ఏపీలో SIR గడువు పొడిగింపు.. మరో 10 రోజులు ఛాన్స్
ఏపీలో SIR గడువు పొడిగింపు.. మరో 10 రోజులు ఛాన్స్
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Warangal Airport: జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Embed widget