అన్వేషించండి

Allu Arjun News: అల్లు అర్జున్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు, ఆయనే వచ్చి పోలీసు వాహనం ఎక్కారు: సెంట్రల్ జోన్ డీసీపీ

Hyderabad News | నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Police Explains Pushpa 2 Actor Allu Arjun Arrest Process | అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నాడు: సెంట్రల్ జోన్ డీసీపీ

హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీసీ తెలిపారు. పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకోగా, దుస్తులు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని పుష్ప 2 నటుడు కోరారు. అతను తన బెడ్రూమ్ లోకి వెళ్లాడు. ఆ సమయంలో పోలీసు సిబ్బంది బయట వేచి ఉన్నారు. అల్లు అర్జున్ బయటకు రాగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీసు సిబ్బంది కూడా అల్లు అర్జున్‌తో గానీ, ఆయన కుటుంబసభ్యులతో గానీ ఏ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. తన భార్యతో, కుటుంబసభ్యులతో అల్లు అర్జున్ సంభాషించడానికి అతనికి తగినంత సమయం ఇచ్చాం. అనంతరం అల్లు అర్జున్ స్వయంగా బయటకు వచ్చి పోలీసు వాహనం ఎక్కాడని సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించారు.

సంధ్య థియేటర్ నుంచి లేఖ వచ్చింది, కానీ

పుష్ప-2 సినిమా విడుదలకు సంబంధించి 04/05-12-2024 తేదీన సంధ్యా సినీ ఎంటర్‌ప్రైజ్ 70 MM వారు బందోబస్తును కోరుతూ చిక్కడపల్లి ఏసీపీకి లేఖ పంపారు. సాధారణంగా   కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలు, మొదలైన కార్యక్రమాలలో బందోబస్తు కోసం మాకు చాలా అభ్యర్థనలు అందుతాయి. ప్రతి ఈవెంట్‌కు బందోబస్తును అందించడం మా వనరులకు మించి అవుతుంది. కనుక భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్న, కొంత మంది ప్రముఖలు సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లో, ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ / ACP / DCP కార్యాలయాన్ని సందర్శించాలి. పోలీసులను కలిసి వివరాలు తెలియజేస్తే, వివరాల ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 

అధికారులను కలిసి ప్రత్యేకంగా కోరలేదు

పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఏ థియేటర్ నిర్వాహకుడు ఏ అధికారిని కలువలేదు. కేవలం ఇన్‌వర్డ్ విభాగంలో మాత్రమే లేఖను సమర్పించారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం తగిన బందోబస్త్ ఏర్పాటు చేసినా.. పోలీసులకు ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. నటుడు అల్లు అర్జున్ వచ్చే వరకు జనం బాగా అదుపులో ఉన్నారు. సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన ఆయన తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమికూడిన ప్రజలకు చేతులు ఊపడం ప్రారంభించారు. సంధ్య థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలా మంది ప్రజలు ఆకర్షితులై అటువైపు ఎక్కువ మంది వెళ్ళారు. 

అదే సమయంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించడానికి ప్రజలను నెట్టడం ప్రారంభించారు. ఈ పెద్ద సమూహమును గమనించి అతనిని వెనక్కి తీసుకువెళ్లాలని అతని టీమ్‌కు తెలియజేశారు. కానీ వారు దానిపై చర్య తీసుకోలేదు, అల్లు అర్జున్ 2 గంటలకు పైగా థియేటర్‌లోనే ఉన్నాడు. అందువల్ల, తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం, అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయని స్పష్టమైంది. ఇందులో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత కూడా వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్నాడు అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వివరించారు.

Also Read: Allu Arjun Arrested: ఒక్కర్నే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సెలబ్రిటీలు వీళ్లే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mulugu District Latest News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget