అన్వేషించండి

JP Nadda In Hyderabad: బీజేపీ ధర్మయుద్ధం చేస్తోంది... తెలంగాణలో నియంతృత్వ పాలన... కేసీఆర్ పై జేపీ నడ్డా ఫైర్

తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని జేపీ నడ్డా ఆరోపించారు. ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్ వచ్చానని ఆయన అన్నారు. ఈ ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు.

తెలంగాణలో నియంతృత్వ, కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఉద్యోగులు, ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్‌ వచ్చినట్టు స్పష్టం చేశారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఈ జీవోను సవరించాలని బండి సంజయ్‌ శాంతియుతంగా నిరసన చేస్తుంటే కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకెళ్లి అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని నడ్డా అన్నారు.  

Also Read:  తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్

బీజేపీ ధర్మ యుద్ధం చేస్తుంది

తెలంగాణలో బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందని జేపీ నడ్డా అన్నారు. ఈ ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. హుజూరాబాద్‌ ఫలితాన్ని తెలంగాణ మొత్తం చూపిస్తామన్నారు. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని జేపీ నడ్డా ఆరోపించారు.  దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి సీఎం కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నారన్నారు. ధర్నాచౌక్‌ వద్ద ధర్నాలు వద్దన్న టీఆర్ఎస్ నేతలే ధర్నాచౌక్‌లో నిరసన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డికి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదని ఆరోపించారు. 

Also Read: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?

ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ చేపట్టిన ర్యాలీ హైటెన్షన్ కు దారితీసింది. పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని, ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని జేపీ నడ్డా అన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్టుగానే శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేశారు. తర్వాత జేపీ నడ్డా బీజేపీ నేతలు గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. బండి సంజయ్‌ను విడుదల చేయాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ నేతలు నల్లమాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, పార్టీ నేతలు వివేక్‌, విజయశాంతి, ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Also Read: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తాను... అరెస్టు చేస్తే అప్పుడు చూద్దాం... సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన జేపీ నడ్డా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget