By: ABP Desam | Updated at : 04 Jan 2022 05:22 PM (IST)
తెలంగాణ హైకోర్టు
కరోనా పరిస్థితుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అవసరమా అని కొంతమంది ప్రశ్నించారు. కమిటీ సభ్యుల ఒత్తిడితో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేసింది. బయటకు వచ్చేందుకే.. ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ అవసరమా అని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని తెలిపింది.
2019 నుమాయిష్ ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదంపై హైకోర్టు విచారణ చేసింది. అయితే అప్పటి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగించినట్టు చెప్పింది. అనుమతులపై ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం.. ఎగ్జిబిషన్ నిలిపివేయడంపై సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసి.., ఎగ్జిబిషన్ నిలిపివేయడం సరికాదని సొసైటీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బయట థియేటర్లు, మాల్స్ కు జనాలు వెళ్తున్నారని.. వాటికి లేని ఆంక్షలు ఎగ్జిబిషన్కు ఎలా విధిస్తారంటూ వాదనలు వినిపించారు.
సోసైటీ వాదనలపై హైకోర్టు.. ఘాటుగా స్పందించింది. ఓ వైపు.. కరోనా, ఒమిక్రాన్ వంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని..., ఈ సమయంలో ఎగ్జిబిషన్ కావాలా? అంటూ ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వమే.. నిర్ణయం తీసుకుంటుందని.. అభిప్రాయపడింది. కరోనా పరిస్థితుల్లో.. ఎగ్జిబిషన్ పై.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.
Also Read: TS High Court: తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
Also Read: Telangana BJP: జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసుల షాక్.. బండి సంజయ్ సీన్ రిపీట్ అవుతుందా?
Also Read: Madhu Yaskhi: కేటీఆర్.. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి, నిజాం షుగర్ ఫ్యాక్టర్ తెరవండి: మధుయాష్కీ గౌడ్
Also Read: Sharmila : ఏపీలో షర్మిల రాజకీయ పార్టీ ఖాయమా ? ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ?
Also Read: Kottagudem: దంపతుల సజీవదహనంతో సంబంధం లేదు... వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కుమారుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?