అన్వేషించండి

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రం నిధులు ఇస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడంలేదని ప్రజలను మభ్యపెడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ఇస్తు్న్న నిధుల వివరాలను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Bandi Sanjay : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని, అయినా కేసీఆర్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ కుటుంబం కొనసాగిస్తున్న దాష్టీకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులతో సభను నిర్వహించి నిర్ణయించారు. ఈ సభ ద్వారా  కేసీఆర్ పాలనలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, సీనియర్ నేతలతో బండి సంజయ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. 

అధికార ప్రతినిధులపై ఆగ్రహం 

ముందుగా రాష్ట్ర అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం గత ఏడేళ్లలో పెద్ద ఎత్తున నిధులిచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించి టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని సూచించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కుమ్కక్కై విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తూ కేంద్రంపై నెపం నెట్టేందుకు చేస్తున్న కుట్రలను బయటపెట్టాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అధికార ప్రతినిధులు అధికార పార్టీ నేతల విమర్శలపై వెంటనే స్పందించాలన్నారు. రోజుకు ఒకరు చొప్పున పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. అధికార ప్రతినిధులు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ సీనియర్ నేతలతో భేటీ 

అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో పలువురితో బండి సంజయ్ సమావేశమయ్యారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఏ ఆకాంక్షల సాకారం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని ఎండగట్టాలని నిర్ణయించామన్నారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదం కేసీఆర్ పాలనలో పూర్తిగా ఫెయిలైందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు పూర్తిగా న్యాయం జరుగుతుందనే సంకేతాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని బండి సంజయ్ భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget