అన్వేషించండి

దళిత బంధుపై పుకార్లు నమ్మవద్దు.. అర్హులందరికీ ఇస్తాం.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడి

దళిత బంధుపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని.. అర్హులందరికీ సాయం అందుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా దళిత బంధును హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.

దళిత బంధు కార్యక్రమంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని.. అర్హులందరికీ సాయం అందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు, ఇతర సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరి చెప్పుడు మాటలు వినవద్దని.. హుజురాబాద్‍లోని ప్రతి కుటుంబానికి దళితబంధు అందిస్తామని స్పష్టం చేశారు.

దళిత బంధును పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్లుండి (ఆగస్టు 16) ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులను అందజేయనున్నట్లు చెప్పారు. దళిత బంధు అమలుకు రూ.2000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీని వల్ల 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.

Also Read: Karimnagar: హుజూరాబాద్‌లో దళితబంధు చెక్కులు తొలుత 15 మందికే.. ఆ తర్వాత మిగతావారికి.. సీఎస్ వెల్లడి

అనవసర ఆరోపణలు.. 
ఎన్నికలప్పుడే దళిత బంధు తెచ్చారని.. దీని ఫలాలు కొందరికే అందుతాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను హరీశ్ ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని.. దళిత బంధు పథకాన్ని మార్చిలోనే ప్రకటించామని, ఆర్థిక మంత్రిగా తానే ఈ పథకం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. దళిత బంధు సాయాన్ని ప్రతి ఒక్కరికీ అందిస్తామని స్పష్టం చేశారు. ఇదే నియోజకవర్గంలో రైతు బంధు ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు.. ఇప్పుడు దళిత బంధు ప్రారంభిస్తుంటే తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు. 

అంత ప్రేమ ఉంటే డబ్బులు ఇప్పించండి.. 
దళిత బంధు కింద రూ.50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ అంటున్నారని.. తమకు చేతనైనంత మేర రూ.10 లక్షలు సాయం చేస్తున్నామని హరీశ్ చెప్పారు. నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే కేంద్రాన్ని అడిగి మరో రూ.40 లక్షలు తీసుకురావాలని బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం తెస్తే పాలాభిషేకం చేస్తామని అన్నారు. 

దళిత బంధుపై పుకార్లు నమ్మవద్దు.. అర్హులందరికీ ఇస్తాం.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడి

దళిత బంధు ఎంపిక ఇలా.. 
దళిత బంధు సాయం అందించేందుకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిని నియమించామని హరీశ్ తెలిపారు. ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. 

దళిత బంధు అడ్డుకోవాలని కుట్రలు.. 
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుపుతున్నారని హరీశ్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దళిత బంధు ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తరాలు రాస్తున్నారని, హైకోర్టులో కేసులు వేస్తున్నారని ప్రస్తావించారు. దళిత జాతి మొత్తం ఈ వ్యవహారాన్ని గమనిస్తోందని, దీని వెనుక ఎవరున్నారనేది ప్రజలు తెలుసుకోగలరని అన్నారు. 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు లక్ష్మణ్ రావుకు హరీశ్ సంతాపం తెలిపారు. లక్ష్మణ్ రావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Also Read: TRS Party News: కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఏమైంది? అక్కడ ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా?  ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
Highway Driving Tips: ఈ టిప్స్‌ పాటిస్తే హైవే సేఫ్‌గా ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు, మీ కోసం 10 చిట్కాలు
హైవేపై లాంగ్‌ ట్రిప్‌ వేస్తున్నారా?, ఈ టిప్స్‌ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ సేఫ్టీ కోసం
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా?  ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
Highway Driving Tips: ఈ టిప్స్‌ పాటిస్తే హైవే సేఫ్‌గా ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు, మీ కోసం 10 చిట్కాలు
హైవేపై లాంగ్‌ ట్రిప్‌ వేస్తున్నారా?, ఈ టిప్స్‌ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ సేఫ్టీ కోసం
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Patanjali Gurukulam: తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
Embed widget