News
News
X

Delhi Liquor Case : లిక్కర్ స్కామ్‌లో కవిత అనుమానితురాలు - 20న హాజరు కావాలని మరోసారి ఈడీ నోటీసులు !

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె అనుమానితురాలని ప్రత్యేక కోర్టుకు తెలిపింది.

FOLLOW US: 
Share:

 


Delhi Liquor Case :  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈ నెల 20 వ తేదిన విచార‌ణ‌కు రావ‌ల‌సిందిగా ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు స్వ‌యంగా హాజ‌రుకావ‌ల‌సిందిగా పేర్కొంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని విచారణ పూర్తయ్యాకే వస్తానని చెప్పి లాయర్‌తో లేఖ  పంపించారు. తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కవిత ఈడీ విచారణకు  హాజరవ్వాల్సి ఉండటంతో మంత్రులు హరీష్ రావు, కవిత ఢిల్లీ వెళ్లారు. వారు కూడా కవితో పాటు హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. 

కవిత విచారణకు హాజరు కాకపోవడంతో  పిళ్లై రిమాండ్ పొడిగింపు

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బినామీగా ఈడీ ఆరోపిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కోర్టులో పిళ్లైను ప్రవేశ పెట్టిన  ఈడీ  అధికారులు కస్టడీ పొడిగించాలని కోరారు. ఈ కేసులో కవిత అనుమానితురాలని.. ఆమెతో కలిసి పిళ్లైను విచారించాల్సి ఉందన్నారు. అయితే  కవిత విచారణకు రాలేదని తెలిపారు. కవిత తన ప్రతినిధి ద్వారా డాక్యుమెంట్స్ పంపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 

సౌత్ గ్రూప్‌ లో కవిత , మాగుంటలను ప్రశ్నించడమే పెండింగ్ 

 నిందితులను ఎదురు ఎదురుగా విచారణ జరపడం చాలా ఎఫెక్టివ్ పద్దతన్నారు. ఈ సందర్బంలో ఈడీ కూడా  కవితకు మరోసారి నోటీసులు జారీ చేశామని కలిపి విచారణ  జరపుతామని పిళ్లై కస్టడీని పొడిగించారని కోరారు. సౌత్ గ్రూప్‌లో ఇంకా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కవితను ప్రశ్నించాల్సి ఉందని  వారిని ప్రశ్నిస్తే సౌత్ గ్రూప్ గురించి విచారణ పూర్తవుతుందన్నారు.  దీంతో కోర్టు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది. 

కవితపై క్ష పూరితంగా కేసులు పెట్టారన్న లాయర్               

కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలన్నారు.  అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తామన్నారు. 

20వ తేదీన కవిత  హాజరవుతారా ?

కవిత లాయర్ తాజాగా ప్రకటించిన  దాని ప్రకారం 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతనే కవిత ఈడీ విచారణకు   హాజరయ్యే అంశంపై స్పందిస్తారు. ఆలోపు విచారణకు హాజరు కారు. అయితే ఈ లోపే అంటే 20వ తేదీనే హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే..  సుప్రీంకోర్టు విచారణకు ముందే హాజరు కావాల్సి ఉంటుంది. మరి కవిత హాజరవుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఒక వేళ హాజరు కాకపోతే విచారణకు సహకరించడం లేదన్న కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకునే  అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

 

Published at : 16 Mar 2023 03:14 PM (IST) Tags: Kavitha ED Investigation Delhi Liquor Scam Kavitha notices again

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్