అన్వేషించండి

Delhi Liquor Case : లిక్కర్ స్కామ్‌లో కవిత అనుమానితురాలు - 20న హాజరు కావాలని మరోసారి ఈడీ నోటీసులు !

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె అనుమానితురాలని ప్రత్యేక కోర్టుకు తెలిపింది.

 


Delhi Liquor Case :  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈ నెల 20 వ తేదిన విచార‌ణ‌కు రావ‌ల‌సిందిగా ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు స్వ‌యంగా హాజ‌రుకావ‌ల‌సిందిగా పేర్కొంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని విచారణ పూర్తయ్యాకే వస్తానని చెప్పి లాయర్‌తో లేఖ  పంపించారు. తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కవిత ఈడీ విచారణకు  హాజరవ్వాల్సి ఉండటంతో మంత్రులు హరీష్ రావు, కవిత ఢిల్లీ వెళ్లారు. వారు కూడా కవితో పాటు హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. 

కవిత విచారణకు హాజరు కాకపోవడంతో  పిళ్లై రిమాండ్ పొడిగింపు

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బినామీగా ఈడీ ఆరోపిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కోర్టులో పిళ్లైను ప్రవేశ పెట్టిన  ఈడీ  అధికారులు కస్టడీ పొడిగించాలని కోరారు. ఈ కేసులో కవిత అనుమానితురాలని.. ఆమెతో కలిసి పిళ్లైను విచారించాల్సి ఉందన్నారు. అయితే  కవిత విచారణకు రాలేదని తెలిపారు. కవిత తన ప్రతినిధి ద్వారా డాక్యుమెంట్స్ పంపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 

సౌత్ గ్రూప్‌ లో కవిత , మాగుంటలను ప్రశ్నించడమే పెండింగ్ 

 నిందితులను ఎదురు ఎదురుగా విచారణ జరపడం చాలా ఎఫెక్టివ్ పద్దతన్నారు. ఈ సందర్బంలో ఈడీ కూడా  కవితకు మరోసారి నోటీసులు జారీ చేశామని కలిపి విచారణ  జరపుతామని పిళ్లై కస్టడీని పొడిగించారని కోరారు. సౌత్ గ్రూప్‌లో ఇంకా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కవితను ప్రశ్నించాల్సి ఉందని  వారిని ప్రశ్నిస్తే సౌత్ గ్రూప్ గురించి విచారణ పూర్తవుతుందన్నారు.  దీంతో కోర్టు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది. 

కవితపై క్ష పూరితంగా కేసులు పెట్టారన్న లాయర్               

కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలన్నారు.  అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తామన్నారు. 

20వ తేదీన కవిత  హాజరవుతారా ?

కవిత లాయర్ తాజాగా ప్రకటించిన  దాని ప్రకారం 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతనే కవిత ఈడీ విచారణకు   హాజరయ్యే అంశంపై స్పందిస్తారు. ఆలోపు విచారణకు హాజరు కారు. అయితే ఈ లోపే అంటే 20వ తేదీనే హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే..  సుప్రీంకోర్టు విచారణకు ముందే హాజరు కావాల్సి ఉంటుంది. మరి కవిత హాజరవుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఒక వేళ హాజరు కాకపోతే విచారణకు సహకరించడం లేదన్న కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకునే  అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
KTR on Kavitha Party: చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget