అన్వేషించండి

TS BJP : తొలి జాబితాకే అసంతృృప్తి - తెలంగాణ బీజేపీ లెక్క తప్పుతోందా ?

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. పార్టీలో తమకు అన్యాయం జరిగిందని రాజీనామా చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

 

TS BJP :  తెలంగాణ బీజేపీ తొలి జాబితా ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు అసతృప్తి వ్యక్తం చే్తున్నారు. టికెట్లు దక్కని ఆశావాహులు సైలెంట్ అవుతున్నారు. కొంత మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. 

అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అసంతృప్తి 

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్‌ రెడ్డి తనకే టికెట్‌ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. నియోజకవర్గానికి పరిమితమై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తీరా ఇప్పుడు ఆ స్థానాన్ని రావు పద్మకు కేటాయించారు. పార్టీ నాయకత్వంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మానకొండూరులో పార్టీ సీనియర్‌ నేత శంకర్‌కు కాకుండా ఇటీవల కొత్తగా చేరిన ఆరెపల్లి మోహన్‌కు పార్టీ టికెట్‌ కేటాయించింది. రామగుండంలో ఇటీవల చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్‌ ఇచ్చింది. గోషామహల్‌ టికెట్‌ కేటాయిస్తామనే బలమైన హామీతోనే విక్రమ్‌గౌడ్‌ హస్తం పార్టీని వీడి కమలం గూటికి చేరారు. రాజాసింగ్‌పై వేటు, తదనంతర పరిణామాలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. తీరా తొలిజాబితాలో ఆయన స్థానంలో రాజాసింగ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

కన్నీరు పెట్టుకున్న నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు 

ముథోల్ టికెట్ రాకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. అలాగే నందీశ్వర్‌గౌడ్‌కు పటాన్‌చెరు టిక్కెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్‌ ​​బీజేపీ అధ్యక్షులు పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేయాలని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.  నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ మొండిచేయి చూపించింది. ఆ స్థానం నుంచి ఎంపీ అర్వింద్‌ సూచించిన ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తాకు సీటిచ్చింది. అర్వింద్‌పై లక్ష్మినారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మెదట జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్‌లో డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి 
 
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వం ప్రకటన బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది.  తనకు కచ్చితంగా ఆ సీటు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నారు.  జాతీయ నాయకత్వం మాత్రం ఆ సీటును మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దీనికి ఆయన సముఖంగా లేరు. తన కొడుక్కి ఆ సీటు ఇస్తే కచ్చితంగా గెలిపించుకుని వస్తానని  చెబుతున్నారు.  దీంతో ఎటూ తేల్చుకోలేక ఎన్నికల కమిటీ ఆ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రెండో జాబితా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని  బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు.                             

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget