అన్వేషించండి

Telangana Assembly : ఫిరాయింపుల వైపు మళ్లిన చర్చతో గందరగోళం - తెలంగాణ అసెంబ్లీలో అసలేం జరిగిందంటే ?

Telangana : తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ రాజకీయం వైపు వెళ్లింది. వ్యక్తిగతంగా మాట్లాడుకున్న అంశాలు చర్చకు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Telangana Assembly :  తెలంగాణ అసెంబ్లీ మొదటి సారి ఆకస్మాత్‌గా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో అనుకోకుండా రాజకీయ అంశాలకు చర్చకు రావడంతో చర్చ పూర్తిగా దారి తప్పింది. రాజకీయంగా పెను వివాదానికి కారణం అయింది. మొదట రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కలు అంటూ ప్రస్తావించి వారు రాజకీయంగా మోసం చేస్తారని వారిని నమ్మవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రేవంత్ రెడ్డి పదే పదే టార్గెట్ చేస్తున్నారని.. ఆడబిడ్డలను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తానే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించానని ప్రకటించారు. 

దీంతో అంశం అంతకంతకూ పెద్దదిగా మారింది. రేవంత్ రెడ్డి ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదని మరో మంత్రి శ్రీధర్ బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  కానీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డిపై మరోసారి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో  పదేళ్ల పాటు పదవులు అనుభవించి ఆ తర్వాత పదవుల కోసమే బీఆర్ఎస్‌లోకి  సబితా ఇంద్రారెడ్డి మారారన్నారు. పార్టీ మారాలనుకున్న రోజున ఆమెను బతిమాలామని.. ఆమె  పార్టీ మారితే.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుని .. దళితుడికి ప్రతిపక్ష నేత  హోదా లేకుండా చేస్తారని చెప్పామన్నారు. అయినా ఆమె వినలేదన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను సబితక్క  బయట పెట్టారని కొనసాగింపుగా ఏం జరిగిందో కూడా తాను చెప్పాల్సి ఉందన్నారు. 

తనను కాంగ్రెస్ పార్టీకి సబిత ఆహ్వానించిన మాట నిజమేనన్నారు. కొడంగల్‌లో ఓడిపోయిన తర్వాత .. మల్కాజిగిరిలో పోటీ చేయాలని పిలిచారని.. సహకరిస్తామని కూడా చెప్పారన్నారు. కానీ ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్‌లో చేరి.. తనను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. మధ్యలో సీతక్క కూడా.. ఇద్దరు అక్కలు కాంగ్రెస్ లో చేరేందుకు రేవంత్ ను సంప్రదించి.. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి తగ్గారని ఆ బాధ సీఎంలో ఉందన్నారు. మొత్తంగా ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ పక్కదారి పట్టింది. రాజకీయ ఫిరాయింపుల దిశగా వెళ్లింది.                  

ఈ చర్చలో తనను అవమానించారని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహిళా సభ్యురాలిని అవమానించినందుకు రేవంత్  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో ఈ గందరగోళం నడుస్తున్న సమయంలో.. కొత్త గవర్నర్‌కు స్వాగతం చెప్పాల్సి రావడంతో ఆయన మధ్యలో బయటకు వెళ్లారు. అప్పుడు సభ వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ.. రేవంత్ సబితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభ్యులు.. పోడియంను  ముట్టడించారు. దీంతో.. ద్రవ్య వినిమయ  బిల్లును ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించి స్పీకర్ సభను వాయిదా వేశారు. తనను సభలో అవమానించారని.. క్షమాపణలు చెప్పాలని సబిత ఇంద్రారెడ్డి సభ వాయిదా పడిన తర్వాత డిమాండ్ చేశారు.                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
Embed widget