అన్వేషించండి

CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!

Revanth Reddy Challenge KCR: భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెబుతున్నా 2029లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.., కాంగ్రెస్సే గెలుస్తుందని రేవంత్ ప్రకటించారు.

Revanth Reddy Predicts 182 Assembly Seats Telangana:    తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరోసారి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన కాంగ్రెస్  రైతు ఆశీర్వాద సభ  బహిరంగ సభ వేదికగా ఆయన బీఆర్‌ఎ అధినేత కేసీఆర్ కుటుంబానికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి శాశ్వతంగా పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ సైనికులు, కార్యకర్తలు నిద్రపోరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  కాచుకో కేసీఆర్.. నీ బలగమంతా ఈ మాట గుర్తుపెట్టుకోండి. భద్రాచలం సీతారామచంద్రస్వామి సాక్షిగా ఒట్టేసి చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం  అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
 
 2029 జూన్‌లో ఎన్నికలు.. 182 అసెంబ్లీ స్థానాలు! 

సరికొత్త జాతీయ రాజకీయ సమీకరణాలను తెరపైకి తెస్తూ రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా జరగబోయే జమిలి ఎన్నికల ప్రణాళికపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్   వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కేంద్రంలోని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం అనుకున్న బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించుకునే కుట్రల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ  బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుందని, 2029 మే లేదా జూన్ నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి సరికొత్త రీతిలో ఎన్నికలు జరుగుతాయని ఆయన అంచనా వేశారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 26కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని సీఎం సరికొత్త లెక్కలను ప్రకటించారు.
  
 పెరిగే స్థానాల్లో 117 సీట్లు కాంగ్రెస్‌వే 

రాబోయే ముందస్తు రాజకీయ ముఖచిత్రంలో పెరిగే 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 స్థానాలను కైవసం చేసుకుని మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిన రాజకీయ జోస్యం ఎలా ఫలించిందో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నేను ఇలానే జోస్యం చెప్పాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 65 సీట్లతో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించాను. మేము అనుకున్నట్లుగానే నాడు 64 సీట్లు సాధించి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు అదే నమ్మకంతో ఖమ్మం గడ్డ పైనుంచి జోస్యం చెబుతున్నా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలవడం ఖాయం  అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
 కేసీఆర్ టార్గెట్‌గా కౌంటర్లు 

జగన్నాథపురం సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు లీడర్లలో, ఇటు సోషల్ మీడియా వేదికలపై పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం రాముడిపై ఒట్టేసి కేసీఆర్‌కు సవాల్ విసరడం, 2029 నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయని కాన్ఫిడెంట్‌గా చెప్పడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.   రైతు భరోసా నిధులు రూ. 1009 కోట్లు విడుదల సందర్భంగా జరిగిన ఈ రైతు ఆశీర్వాద సభ  కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు వేదికగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్‌ఎస్ శ్రేణులను పూర్తిగా నిరుత్సాహపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రసంగం చేశారు. నియోజకవర్గాల విభజన బిల్లుపై కేంద్రం అడుగులు, 26 ఎంపీ స్థానాల పెంపు వంటి జాతీయాంశాలను రేవంత్ ప్రస్తావించడంతో.. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget