By: ABP Desam | Updated at : 29 Mar 2022 08:31 PM (IST)
ఉక్రెయిన్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ లేఖ
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థు విషయంలో జోక్యం చేసుకుని ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ( TS CM KCR ) ప్రధాని మోదీకి ( PM MODI ) లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి వైద్య విద్య కొనసాగాలని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వైద్య కళాశాలల్లో ఉక్రెయిన్ విద్యార్థుల కోసం అదనంగా సీట్లు పెంచాలన్నారు. ఉక్రెయిన్ (Ukraine ) నుంచి 700 మంది వైద్య విద్యార్థులు తెలంగాణకు వచ్చారనికి లేఖలో తెలిపారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ( Medical Student ) ప్రభుత్వం భరిస్తుందని లేఖలో సీఎం పేర్కొన్నారు. మానవ తాదృక్పథంతో త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, రెగ్యులరైజేషన్ కు ఆర్థికశాఖ కసరత్తు
ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది విద్యార్థులు ఇండియాకు ( India ) తిరిగి వచ్చారని, వీరిలో దాదాపు అందరూ మెడికల్ విద్యార్థులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా.. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ( Students) ఆదుకోవాలని కోరారు. ఇటీవల అసెంబ్లీలోప్రసంగించిన కేసీఆర్.. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువులను భరిస్తామని ప్రకటించారు. అయితే వారి చదువు కొనసాగింపు ఇప్పుడు కష్టంగా మారింది. యుద్ధం ముగిసినా మళ్లీ ఉక్రెయిన్కు వెళ్లి చదువుకునే పరిస్థితులు ఉండవు. ఈ కారణగా ఎక్కువ మంది ఇక్కడే విద్యను కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ వారికి సీట్లు ( Medical Seats ) అందుబాటులో ఉండవు.
గాంధీ భవన్ కాదది కుస్తీ భవన్- కాంగ్రెస్పై టీఆర్ఎస్ విసుర్లు
ఈ సమస్య ఒక్క తెలంగాణది ( Telangana (మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వారందరిదీ సమస్యే. వారంతా వివిధ సెమిస్టర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ వైద్య విద్యలో ప్రాక్టికల్స్ ( Medical Practicals ) ముఖ్యం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలన్న డి్మాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ కూడా... ఉక్రెయిన్ విద్యార్థులు తనను కలిసినప్పుడు.. వారి చదువు కొనసాగింపుపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. కేసీఆర్ లేఖపై కేంద్రం ( Central Governament ) స్పందిస్తే ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వారి కష్టాలు తిరినట్లేనని అనుకోవచ్చు.
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
‘యానిమల్’, ‘దూత’ రివ్యూలు, 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
/body>