అన్వేషించండి

TRS On Congress: గాంధీ భవన్ కాదది కుస్తీ భవన్- కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ విసుర్లు

తెలంగాణలో ధాన్యం పంచాయితీలో కాంగ్రెస్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ చేసిన ట్వీట్‌, ఆ తర్వాత పరిణామాలపై టీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలుగా అభివర్ణిస్తోంది.

తెలంగాణ(Telangana) రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని కేంద్రం మెడలు వంచి అయినా సరే కొనుగోలు చేయిస్తామన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prasanth Reddy). ఉగాది పండుగ తర్వాత కేంద్రంపై పోరుబాటకు శ్రీకారం చుడతామన్నారు. మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో అన్నదాతలు సాగు చేసిన వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉండగా, లేనిపోని కొర్రీలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రం తన గురుతర బాధ్యతను విస్మరిస్తూ కేవలం ఓ వ్యాపారి తరహాలో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు ప్రశాంత్ రెడ్డి. సహచర మంత్రులతో కలిసి తాను దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిస్తే తెలంగాణ ప్రజలను అవహేళన చేసే రీతిలో మాట్లాడారని ఆక్షేపించారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కోరితే, అందుకు కేంద్రం నిరాకరిస్తూ వివక్ష పూరిత ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యాన్ని పట్టిస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, ఇదే విషయాన్ని పీయూష్ గోయల్ కు వివరించామన్నారు. ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించాలని చెప్పడం పీయూష్ అహంకారాన్ని చాటిందన్నారు. ఆరు నూరైనా కేంద్రంతోనే ధాన్యం కొనుగోలు చేయించి తీరుతామని, అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాడుతామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 

తెలంగాణ బిజెపి(Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తన వాగ్దానాన్ని నిలుపుకోవాలని సూచించారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయిస్తే బండి సంజయ్ కు తాము సహకరిస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీని, ఆ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేదన్నారు. వారి నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాన్సెన్స్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) న్యూసెన్స్ అని అన్నారు టీఆర్‌ఎస్‌(TRS) ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి(Jeevan Reddy). తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని పార్లమెంటులో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్ ఇద్దరు కూడా ఐరన్ లెగ్‌లుగా అభివర్ణించారాయన. వీళ్లు ఎక్కడ కాలుపెడితే అక్కడ నాశనమేనన్నారు. 

బీజేపీలో ట్రిబుల్ ఆర్ ఉన్నట్లే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రూపంలో డబుల్ ఆర్ ఉందన్నారు జీవన్ రెడ్డి. వీళ్లు ప్రజలకు ట్రబుల్ అని, దేశానికి దరిద్రమన్నారు. రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోయినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి కారణంగానే టీడీపీ ఆఫీస్‌కు తాళం పడిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కాలుపెట్టిన వెంటనే హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. గాంధీ భవన్ కాస్త  కుస్తీ భవన్ గా మార్చారని ఎద్దేవా చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget