అన్వేషించండి

Kishan Reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం... డిసెంబర్ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. డిసెంబర్‌ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దు అవ్వడం తన జీవితంలో మర్చిపోలేని విషయమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించానని తెలిపారు. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 75 వారాలపాటు జరగనున్న ఉత్సవాలను విజయవంతం నిర్వహిస్తామని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.  నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి

కరోనా సమయంలో హోంశాఖ నేతృత్వంలో నిర్వహించిన కంట్రోల్ రూం బాధ్యతలు చూశానని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరిపామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనపై నమ్మకం ఉంచి మూడు శాఖలు అప్పగించిన ప్రధాని మోదీకి రుణపడి ఉంటానన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తుందన్న ఆయన ఆ నిధులను ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. దేశంలో 3,700 ప్రాచీన కట్టడాలు ఉన్నాయని వాటిలో 40 కట్టడాలకు యూనెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. రామప్పకు యూనెస్కో గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. 

Also Read: Three Capital Govt Plan : మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందా.. ? వ్యూహం మార్చిందా..?

రామప్పకు గుర్తింపు హర్షణీయం

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గోల్కొండ అభివృద్ధికి జీఎంఆర్‌ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 75 పురాతన కట్టడాలు, చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబర్‌ నుంచి దేఖో అప్‌నా దేశ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. 

Also Read: Disha Law : "దిశ" చుట్టూ ఏపీ రాజకీయం ! ఆ చట్టం ఉందా ? లేదా ?

 75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు 

ఆజాదీకా అమృత్ వర్ష్ పేరుతో 75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామన్న ఆయన... అప్పటికి దేశాభివృద్ధిపై సగర్వంగా చెప్పుకోవాలన్నది ప్రధాని ఆకాంక్ష అన్నారు.  ప్రతీ వ్యాపార సంస్థ ఆజాదీకా అమృత్ మహోత్సవం లోగో పెట్టుకోవాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామాల మ్యాపింగ్ చేయాలన్నారు. 

 

Also Read: Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget