అన్వేషించండి

Kishan Reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం... డిసెంబర్ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. డిసెంబర్‌ నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దు అవ్వడం తన జీవితంలో మర్చిపోలేని విషయమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించానని తెలిపారు. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 75 వారాలపాటు జరగనున్న ఉత్సవాలను విజయవంతం నిర్వహిస్తామని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.  నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి

కరోనా సమయంలో హోంశాఖ నేతృత్వంలో నిర్వహించిన కంట్రోల్ రూం బాధ్యతలు చూశానని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరిపామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనపై నమ్మకం ఉంచి మూడు శాఖలు అప్పగించిన ప్రధాని మోదీకి రుణపడి ఉంటానన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం బడ్జెట్ ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తుందన్న ఆయన ఆ నిధులను ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. దేశంలో 3,700 ప్రాచీన కట్టడాలు ఉన్నాయని వాటిలో 40 కట్టడాలకు యూనెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. రామప్పకు యూనెస్కో గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. 

Also Read: Three Capital Govt Plan : మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందా.. ? వ్యూహం మార్చిందా..?

రామప్పకు గుర్తింపు హర్షణీయం

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గోల్కొండ అభివృద్ధికి జీఎంఆర్‌ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 75 పురాతన కట్టడాలు, చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబర్‌ నుంచి దేఖో అప్‌నా దేశ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. 

Also Read: Disha Law : "దిశ" చుట్టూ ఏపీ రాజకీయం ! ఆ చట్టం ఉందా ? లేదా ?

 75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు 

ఆజాదీకా అమృత్ వర్ష్ పేరుతో 75 వారాల పాటు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయని స్పష్టం చేశారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామన్న ఆయన... అప్పటికి దేశాభివృద్ధిపై సగర్వంగా చెప్పుకోవాలన్నది ప్రధాని ఆకాంక్ష అన్నారు.  ప్రతీ వ్యాపార సంస్థ ఆజాదీకా అమృత్ మహోత్సవం లోగో పెట్టుకోవాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామాల మ్యాపింగ్ చేయాలన్నారు. 

 

Also Read: Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget