అన్వేషించండి

Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు

Telangana News: లగచర్ల ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతల బృందం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.

BRS Leaders Complaint To SC ST Commission On Lagacharla Case: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. లగచర్లలో (Lagacharla) రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు విమర్శించారు. బాధిత మహిళలతో కలిసి శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించారు. రైతులు దాడులు చేశారనే కారణంతో అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి బూతులు తిట్టారని.. వేధించారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

'దురహంకారంతో భూములు లాక్కొంటున్నారు'

కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములు లాక్కుకుంటారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులను మెప్పించడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి... ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడో చెప్పాలన్నారు. రేవంత్ సీఎం అయితే మాకు లాభం జరుగుతుందని గిరిజనులు అనుకుంటే వారి పొట్టకొడుతున్నాడని విమర్శించారు. ఫార్మా కంపెనీ కారణంగా కాలుష్యంతో జీవితాలు ఆగమవుతాయని లగచర్లలో చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని.. ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు సోయి లేదో చెప్పాలన్నారు. 'కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టడమేంటి?. అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా రైతులను జైలుల్లో పెట్టడం అమానుషం. సీఎం ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమన్న ఇక్కడ ప్రజలపై పెట్టాలి. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కలెక్టర్‌పై దాడులు చేశారంటూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.' అని డిమాండ్ చేశారు. 

'ఎస్సీ, ఎస్టీలపై దాడి'

లగచర్లలో నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో మహిళలపై పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని మండిపడ్డారు. వెంటనే ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచార కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తోందన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని ఆయన చెప్పారు. 

'ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోం'

ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని గట్టిగా చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు, జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు.

Also Read: Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget