అన్వేషించండి

Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు

Telangana News: లగచర్ల ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతల బృందం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.

BRS Leaders Complaint To SC ST Commission On Lagacharla Case: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనకు పరాకాష్ట లగచర్ల ఘటన అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. లగచర్లలో (Lagacharla) రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు విమర్శించారు. బాధిత మహిళలతో కలిసి శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని కమిషన్‌కు వివరించారు. రైతులు దాడులు చేశారనే కారణంతో అర్ధరాత్రి ఇంటిపైకి వచ్చి బూతులు తిట్టారని.. వేధించారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

'దురహంకారంతో భూములు లాక్కొంటున్నారు'

కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములు లాక్కుకుంటారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులను మెప్పించడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి... ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడో చెప్పాలన్నారు. రేవంత్ సీఎం అయితే మాకు లాభం జరుగుతుందని గిరిజనులు అనుకుంటే వారి పొట్టకొడుతున్నాడని విమర్శించారు. ఫార్మా కంపెనీ కారణంగా కాలుష్యంతో జీవితాలు ఆగమవుతాయని లగచర్లలో చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని.. ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు సోయి లేదో చెప్పాలన్నారు. 'కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టడమేంటి?. అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా రైతులను జైలుల్లో పెట్టడం అమానుషం. సీఎం ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమన్న ఇక్కడ ప్రజలపై పెట్టాలి. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడు. కలెక్టర్‌పై దాడులు చేశారంటూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి.' అని డిమాండ్ చేశారు. 

'ఎస్సీ, ఎస్టీలపై దాడి'

లగచర్లలో నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో మహిళలపై పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని మండిపడ్డారు. వెంటనే ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచార కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తోందన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని ఆయన చెప్పారు. 

'ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోం'

ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని గట్టిగా చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు, జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు.

Also Read: Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget