అన్వేషించండి

Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ

Telangana News | వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Kakatiya Mega Textile Park | వరంగల్‍: వరంగల్‍ (Warangal) కాకతీయ మెగా టెక్స్​టైల్స్​ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. టెక్స్ టైల్ పార్కు కోసం భూమలు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూ నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయంలో తాము భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, తమకు న్యాయం జరగలదేని టెక్స్ టైల్ పార్క్ నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి న్యాయం చేయడానికి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి.

బీఆర్ఎస్  ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు

వరంగల్‍ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో చింతలపల్లి వద్ద గత బీఆర్ఎస్  ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2016 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి దశలవారీగా 1357 ఎకరాలను సేకరించారు.  ఈ క్రమంలో 2017 అక్టోబర్‍ 22న అప్పటి సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్ టైల్ పార్క్​కు శంకుస్థాపన చేశారు. స్థానికులకు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని, వారి జీవితాలు మారతాయని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వడంతో పాటు టెక్స్ టైల్ పార్క్​ఏరియాలో ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున చేసి నిర్వాసితులకు డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ నెలలు, ఏళ్లు గడిచినా పూర్తి స్థాయిలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కాలేదు. దాంతో ఇంటికో జాబ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ సర్కార్ కట్టించి ఇవ్వలేదు. 

గత ప్రభుత్వం చెప్పడంతో భూములు ఇచ్చిన రైతులు
యంగ్‍ వన్ కంపెనీ, కైటెక్స్​ కంపెనీ, మరో కంపెనీల ద్వారా 50 నుంచి 60 వేల ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వం చెప్పడంతో రైతులు భూములు ఇచ్చారు. మెగా టెక్స్​టైల్​ పార్కులో వచ్చే కంపెనీల ద్వారా పత్తికి భారీ ధరలు వస్తాయని.. మేడిన్ తెలంగాణ, మేడిన్ వరంగల్ అంటూ కేటీఆర్ చెప్పారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు అమెరికా, యూరప్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి అవుతాయని గత పాలకులు చెప్పారు. కానీ చెత్త నుంచి దారం తీసే కంపెనీలు వచ్చాయని, మెషీన్ల ద్వారా పని జరుగుతోందని.. మిగతా పనిని బిహార్, ఒడిశాల, ఝార్కండ్ నుంచి వచ్చే వకూలీలతో చేపిస్తున్నారని గతంలోనే అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు భూమి పోయిందని, ఇటు ఇండ్లు ఇవ్వకపోగా, ఉద్యోగాలు కూడా రాలేదని పలుమార్లు నిరసన తెలిపారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget