అన్వేషించండి

KTR About Modi: కర్ణాటక, ఏపీ ప్రాజెక్టులకు జాతీయ హోదా - తెలంగాణకు ఏం ఇచ్చారు: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు

Telangana News: తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో ఏం చేశారని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మీ ప్రాధాన్యత మేం కానప్పుడు, మా ప్రాధాన్యత మీరు కాదన్నారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. పదేళ్ల ఎన్డీఏ పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కింది.. అన్యాయాలు.. అవమానాలు.. అవహేళనలే అన్నారు. మీ పాలనలో కేవలం ఉత్తర కాశీని మాత్రం అందంగా తీర్చిదిద్దారు.. దక్షిణ కాశీగా భావించే వేములవాడకు ఏమిచ్చారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

వరంగల్ జిల్లాకు మరోసారి వచ్చి వెళ్లారు కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీని మాత్రం మరిచారు. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని మరోసారి బొందపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ అత్యున్నత చట్ట సభైన పార్లమెంట్ సాక్షిగా.. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించారు. పురిట్లోనే ఏడు మండలాలు లాక్కొని అన్యాయం చేశారు. బియ్యం కొనమంటే నూకలు తినమని అవహేళన చేశారు. ఇంత ధాన్యం ఎలా పండిందని రైతుల శక్తిని అనుమానించారు. పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పదేళ్లుగా పాతరేశారు’ అని కేటీర్ అధికార ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

పక్కనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు కానీ, తెలంగాణ జాతికి మాత్రం మొండిచేయి చూపారని కేటీఆర్ విమర్శించారు. పదేళ్లు మీ భజన తప్ప.. విభజన హామీలు సాధించని బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు మళ్లీ ఓటేయాలి ? అని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రశ్నించారు. లక్షలాది మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆగం చేసిన బీజేపీకి బుద్ధిచెప్పేందుకు యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కత్తి పెట్టినందుకు.. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వనందుకు, కమలం పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని సెటైర్లు వేశారు. నిత్యవసర వస్తువుల ధరల మోత మోగించి.. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిన ఎన్డీఏకు గుణపాఠం చెప్పేందుకు మహిళాలోకం సిద్ధంగా ఉందన్నారు. పదేళ్లలో ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ ఇవ్వకుండా ఆగంచేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నూకలు తినమని అవమానించిన బీజేపీ నేతల తోకలు కట్ చేయడానికి మొత్తం తెలంగాణ ప్రజలు సిద్ధమన్నారు కేటీఆర్.  

మీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. మా ప్రజల ప్రాధాన్యతల్లో బీజేపీ ఎలా ఉంటుంది ? అని కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్లలో ఏం చేశారో విషయం చెప్పమంటే.. మళ్లీ విషం చిమ్మి వెళ్లారు. డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్న ఛోటాభాయిపై చర్యలకు మాత్రం వెనకాడుతున్నారని విమర్శించారు. కానీ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు, జేబు సంస్థలతో వెంటాడి వేటాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తర భారతంలో మోడీ వేడి తగ్గడంతో దక్షిణాదిపై బీజేపీ దండయాత్రను సాగిస్తున్నారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలు మీ పదేళ్ల  పరిపాలనా తీరు చూశారు. ప్రచార పర్వాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. ఎవరెంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా.. ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ కు ఆస్కారం లేదన్నారు. ఎందుకంటే.. ఈ  పార్లమెంట్ ఎన్నికల్లో విభజన హామీలే.. ప్రధాన అంశాలని.. ఆ ప్రజా సమస్యలే తమ ఎన్నికల ఎజెండా అని రాసుకొచ్చారు. 

 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget